
నమ్మకం..భరోసా
కోనరావుపేట(వేములవాడ): నాణ్యమైన బోధన.. ఆకట్టుకునే సౌకర్యాలు.. ఉపాధ్యాయులు కల్పిస్తు న్న విశ్వాసంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కోనరావుపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా 111 మంది అడ్మిషన్లు తీసుకున్నారంటే ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులపై నమ్మకానికి నిదర్శనం. హెచ్ఎం మదన్లాల్ పట్టుదల.. ఉపాధ్యాయుల కృషితో రోజురోజుకు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్కు దీటుగా గుర్తింపు పొందిన పీఎంశ్రీ కోనరావుపేట ఉపాధ్యాయులను మిగతా వారు ఆదర్శంగా తీసుకుంటే ప్రభుత్వ బడులు బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
పీఎంశ్రీ నిధులతో సౌకర్యాలు
కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను 2024–25 విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. అప్పటి నుంచి పాఠశాలలో ప్రీప్రైమరీ నిర్వహిస్తున్నారు. ఏటా వస్తున్న నిధులతో పాఠశాలలో మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్టూర్లకు వెళ్తున్నారు. పాఠశాలలో అన్ని రకాల క్రీడావస్తువులు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు హౌస్లుగా విద్యార్థులు
విద్యార్థులను రెడ్, గ్రీన్, యెల్లో, బ్లూ హౌస్లుగా విభజించారు. ఆయా గ్రూపుల్లోని విద్యార్థులు ఒక్కోవారం పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలోని ప్రార్థన నుంచి మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థులు తింటున్నారా.. లేదా.. అనే బాధ్యతలు ఈ నాలుగు గ్రూపుల్లోని విద్యార్థులు చూసుకుంటున్నారు. దీని ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని హెచ్ఎం మదన్లాల్ పేర్కొంటున్నారు. ఈ నాలుగు హౌస్ల విద్యార్థులకు నాలుగు రంగుల్లో టీషర్టులను దాతల సహాయంతో సమకూర్చారు.
230కి చేరిన విద్యార్థుల సంఖ్య
కోనరావుపేట పాఠశాలలో గత విద్యాసంవత్సరం 153 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. వీరిలో 30 మంది ఆరో తరగతికి వెళ్లారు. దీంతో వి ద్యార్థుల సంఖ్య 123కు పడిపోయింది. ఈ విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే హెచ్ఎం, ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న చిన్నారుల తల్లిదండ్రులను కలిశారు. వారిలో నమ్మకాన్ని కల్పించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న 111 మంది విద్యార్థులు ప్ర భుత్వ పాఠశాలలో చేరడంలో సఫలీకృతులయ్యా రు. దీంతో విద్యార్థుల సంఖ్య 234కు చేరింది.
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్లో చేరిన విద్యార్థులు
నాణ్యమైన విద్యనందిస్తున్న ఉపాధ్యాయులు
కోనరావుపేట పీఎంశ్రీ పాఠశాలలో కొత్తగా 111 అడ్మిషన్లు
234కు చేరిన విద్యార్థులు
ఇద్దరు పిల్లలు ప్రభుత్వ స్కూల్కే
నాకు ఇద్దరు కొడుకులు. గతేడాది ఇద్దరిని నిమ్మపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు పంపాను. కోనరావుపేటలోని పీఎంశ్రీ పాఠశాలలో విద్యాబోధన బాగుండడంతోపాటు ఉపాధ్యాయుల అంకితభావంతో ఈ సంవత్సరం ఇద్దరిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాను.
– రాస రవీందర్రెడ్డి, విద్యార్థుల తండ్రి
పాఠశాల బాగుంది
నేను పీఎంశ్రీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాను. పాఠశాల ఆవరణ, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల కంటే బాగా పాఠాలు చెబుతున్నారు. నిత్యం అన్ని రకాల ఆటలు ఆడిపిస్తున్నారు. కంప్యూటర్ గురించి కూడా చెబుతున్నారు.
– కరెడ్ల హర్షవర్థన్, ఐదో తరగతి
నాణ్యమైన విద్యాబోధన
కోనరావుపేటలోని పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకంటే నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాం. క్రమశిక్షణతోపాటు అన్నిరకాల క్రీడలు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నాం. వీటన్నింటిని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను మా పాఠశాలలో చేర్పిస్తున్నారు.
– అజ్మీరా మదన్లాల్, హెచ్ఎం కోనరావుపేట

నమ్మకం..భరోసా

నమ్మకం..భరోసా

నమ్మకం..భరోసా

నమ్మకం..భరోసా