
పశువులకు మందుల్లేవ్ !
● ప్రైవేటు షాపులే దిక్కు ● ఆర్థికంగా నష్టపోతున్న పశు పోషకులు ● 15 నెలలుగా నిలిచిన మందుల సరఫరా ● పట్టించుకోని జిల్లా అధికారులు ● జిల్లాలో పశుసంపద 4,78,523
ఇతను పాశం బాబు. వీర్నపల్లికి చెందిన బాబుకు 60 వరకు గొర్రెలు ఉంటాయి. నిత్యం శివారు అడవుల్లో గొర్రెలను మేపుతుంటాడు. వీర్నపల్లిలో పశువైద్యశాల ఉన్నా డాక్టర్ లేరు. ఇన్చార్జి డాక్టర్ వచ్చిపోతుంటారు. ఆస్పత్రిలో మందులు లేవు. దీంతో గొర్రెలకు ఏ జబ్బు సోకినా సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట వంటి ప్రాంతాలకు వెళ్లి పశువుల మందుల దుకాణాల్లో ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిందే. గొర్రెలకు నట్టల నివారణ మందులు కూడా ఇవ్వడం లేదు.
రుద్రంగి మండల కేంద్రం శివారులో నీటిమడుగులో బర్రెలు బొర్లుతున్నాయి. మురికినీరు కావడంతో బర్రెలకు జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవే పశువులు ఇచ్చే పాలను సమాజంలోనే అనేక మంది తాగుతున్నారు. బర్రెపాలతో టీ, కాఫీలు, పెరుగు చేసుకుని ఆరగిస్తున్నాం. నోరు లేని మూగజీవాలు సమాజానికి పౌష్టికాహారాన్ని అందిస్తుండగా.. వాటికి అనారోగ్యం ఏర్పడితే.. మందులు ఇచ్చే దిక్కులేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పశువైద్యశాలల్లో మందులు లేవు.

పశువులకు మందుల్లేవ్ !

పశువులకు మందుల్లేవ్ !