
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ఆరోగ్య తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్లో 76 మందికి కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు, 54 మందికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులను శుక్రవారం అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చినా సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధిలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణాన్ని, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు.