
లింగనిర్ధారణ నిషేధం
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: గర్భస్థ లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఎవరై చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్వో రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శుక్రవారం పీసీపీఎన్డీటీ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పీసీపీఎన్డీటీ యాక్ట్–1994–1996 నిబంధనలకు విరుద్ధంగా నడిపే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామన్నారు. నిబంధనలు పాటించకుంటే రూ.50వేల జరిమానాలతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94400 54641లో తెలపాలని కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్లు అనిత, రామకృష్ణ, సంపత్, ఎన్జీవో ప్రతినిధి చింతోజు భాస్కర్, లీగల్ అడ్వయిజర్ శాంతిప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మీ, టమటమ రామానుజమ్మ, డిప్యూటీ డెమో రాజ్కుమార్, హెచ్ఈలు బాలయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.