పాలిసెట్‌ కౌన్సిలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌

Jun 28 2025 5:55 AM | Updated on Jun 28 2025 7:28 AM

పాలిస

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌

వేములవాడఅర్బన్‌: అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం పాలీసెట్‌ ప్రవేశపరీక్షలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల అడ్మిషన్‌ కోసం కౌన్సిలింగ్‌ శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రి న్సిపాల్‌ ప్రభాకరాచారి తెలిపారు. తొలిరోజు 200 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చే సుకోవాలని సూచించారు. ఈనెల 29 వరకు కౌన్సిలింగ్‌ కొనసాగుతుందని తెలిపారు.

పోలీస్‌ వాహనాలు కండీషన్‌లో ఉండాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): పోలీస్‌ వాహనాలు కండీషన్‌లో ఉండేలా చూడాలని ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయించాలని ఆర్‌ఐ ఎంటీవో వి.మధుకర్‌ సూచించారు. తంగళ్లపల్లి ఠానాలో పోలీస్‌ వాహనాలను శుక్రవారం పరిశీలించారు. ఎస్సై ఎం.ఉపేంద్రచారి, ఏఎస్సై రవీందర్‌, యూనిట్‌ మెకానిక్‌ సమీయొద్దీన్‌ పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సిరిసిల్లకల్చరల్‌: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రతినిధులు అజ్జ వేణు, కడారి రాములు కోరారు. ఈమేరకు జిల్లా ఉన్నతాధికారులకు శుక్రవారం సమ్మె నోటీస్‌ అందజేశారు.

విహారయాత్రకు ఆర్టీసీ బస్సులు

వేములవాడఅర్బన్‌: వేములవాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రతీ శనివారం విహారయాత్రకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం కొడిమ్యాల గ్రామ ప్రజలు గన్నేరువరం మండలం ఖాసీంపేటలోని మానసాదేవీ, వర్గల్‌ సరస్వతీదేవి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శనివారం విహారయాత్ర ఉంటుందని, గ్రామంలో 30 మంది కలిసి వారు ఎంచుకున్న ఆలయలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కల్వర్టు పనులు అడ్డగింత

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లి నుంచి సుద్దాల వరకు చేపట్టిన తారురోడ్డు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కల్వ ర్టు పనులను రైతులు అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ కల్వర్టు పనులను లోతుగా తవ్వి చేస్తుండడంతో వర్షాలకు పొలాల్లోకి నీరు చేరి పంటలు నష్టపోతామన్నారు. కల్వర్టు నుంచి బతుకమ్మకుంట వరకు కాల్వ ఉందని, లోతు తగ్గించి నిర్మిస్తే వర్షపు నీరు కాల్వ ద్వారా కుంటలోకి చేరుతుందన్నారు. అధికారులు పునరాలోచించి రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు. దొబ్బల నరేశ్‌, మాసం దావీవ్‌, దిలీప్‌, ఆనందం, దాసు, దొబ్బల కాంతయ్య, ప్రతాప్‌రెడ్డి, బొడ్డు స్వామి పాల్గొన్నారు.

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌
1
1/4

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌
2
2/4

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌
3
3/4

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌
4
4/4

పాలిసెట్‌ కౌన్సిలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement