
ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రజల మన్ననలు పొందేలా.. పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బంది, హోమ్గార్డ్ సిబ్బంది శనివారం నిర్వహించిన వీక్లీ పరేడ్లో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. వాకింగ్, వ్యాయామం చేయాలన్నారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే తనను కలవాలని తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు రమేశ్, మధుకర్, యాదగిరి, సీఐలు కృష్ణ, మొగిలి, మధుకర్, ఎస్సైలు కిరణ్కుమార్, వినీతరెడ్డి, జునైద్, శ్రవణ్యాదవ్ పాల్గొన్నారు.
● ఎస్పీ మహేశ్ బీ గీతే