
బ్యాక్బిల్లింగ్ను పరిష్కరించండి
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ప్రభుత్వం ఇస్తున్న 50 శాతం విద్యుత్ సబ్సిడీ విషయంలో సెస్ విధించిన బ్యాక్బిల్లింగ్ను రద్దు చేయాలని వస్త్రోత్పత్తిదారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విన్నవించారు. హైదరాబాద్లో ని సెక్రటేరియట్లో రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్తిని అనిల్కుమార్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, చేనేత వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, కార్యదర్శి గౌడ రాజు, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, పాలిస్టర్ అసోసియేషన్ కార్యదర్శి అంకాలపు రవి, వెల్దండి దేవదాస్, బూట్ల నవీన్, సతీశ్, బండారి అశోక్, దూస వినయ్ పాల్గొన్నారు.
సెస్లో అక్రమాలపై ఫిర్యాదు
సిరిసిల్లటౌన్: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సిరిసిల్లలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి ఫిర్యాదు చేసింది. శనివారం మంత్రిని హైదరాబాద్లో కలిసిన అనంతరం సమితి అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2022, 2022 నుంచి 2025 వరకు సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తన పరిధిని అతిక్రమించి అలవెన్సులు పొందుతుండడంతో సంస్థపై భా రం పడుతుందన్నారు. సెస్ మహాసభలో ప్రవేశపెట్టిన ఎజెండాలోని కొన్ని అంశాలతో సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పులి లక్ష్మీపతి, సబ్బని లక్ష్మీరాజం, కుసుల గణేశ్, చిప్ప దేవదాసు, జోగినిపల్లి సంపత్రావు ఉన్నారు.