అంత్యక్రియలకూ అవస్థలే.. | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకూ అవస్థలే..

Jun 29 2025 3:02 AM | Updated on Jun 29 2025 3:02 AM

అంత్య

అంత్యక్రియలకూ అవస్థలే..

● ఊరికి దూరంగా వైకుంఠధామాలు ● సగానికి పైగా నిరుపయోగం ● విలీన గ్రామాల్లో అసంపూర్తి నిర్మాణాలు

సిరిసిల్లఅర్బన్‌: ఆఖరీ మజిలీ గౌరవప్రదంగా ముగియాలని అందరూ కోరుకుంటారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో వైకుంఠధామాలు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. రోడ్డు వసతి లేకపోవడం.. శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కో నిర్మాణానికి రూ.12.60 లక్షల చొప్పున రూ.32.13కోట్ల వ్యయంతో వైకుంఠధామాలు నిర్మించారు. నీటి వసతి లేక.. రోడ్డు సౌకర్యం కరువై ఇబ్బంది పడుతున్నారు.

అసంపూర్తి నిర్మాణాలు

● సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్దాపూర్‌, జగ్గారావుపల్లి, చంద్రంపేట, రాజీవ్‌నగర్‌, చిన్నబోనాల గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు.

● సర్ధాపూర్‌, చంద్రంపేటల్లో అసంపూర్తిగానే వదిలేశారు.

● రగుడు వైకుంఠధామంలో విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు.

● చిన్నబోనాలలో స్థలం ఉన్నా వైకుంఠధామం నిర్మించలేదు. దీంతో పంటపొలాలు, గ్రామశివారులోని చెరువులో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

అంత్యక్రియలకూ అవస్థలే..1
1/1

అంత్యక్రియలకూ అవస్థలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement