
వైకుంఠధామం నిర్మించాలి
గ్రామంలో వైకుంఠధామం లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులకు చాలాసార్లు చెప్పిన పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎవరైనా మృతిచెందితే సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని చెరువు వద్దకు వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికై నా నిధులు కేటాయించి వైకుంఠధామం నిర్మించాలి. – బొల్గం నాగరాజు, మాజీ కౌన్సిలర్, చిన్నబోనాల
సౌకర్యాలు కల్పిస్తాం
గ్రామాలకు దూరంగా ఉన్న వైకుంఠధామాలకు నిధులు మంజురైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విద్యుత్ సౌకర్యం లేని వాటిలో సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం.
– షర్పొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి