
కోడెలను సంరక్షించుకోవాలి
● పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● రాజన్న గోశాలలో 137 జతల కోడెలు పంపిణీ
వేములవాడఅర్బన్: రాజన్న కోడెలను రైతులు జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించారు. అర్హులైన రైతులకు 137 జతల కోడెలను ఆదివారం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ న్న ఆలయ ఈవో రాధాభాయి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.