వైద్యకళాశాలను సందర్శించిన మానిటరింగ్‌ కమిటీ | - | Sakshi
Sakshi News home page

వైద్యకళాశాలను సందర్శించిన మానిటరింగ్‌ కమిటీ

Jun 30 2025 3:48 AM | Updated on Jun 30 2025 3:48 AM

వైద్యకళాశాలను సందర్శించిన మానిటరింగ్‌ కమిటీ

వైద్యకళాశాలను సందర్శించిన మానిటరింగ్‌ కమిటీ

సిరిసిల్లఅర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాల, అనుబంధ బోధన ఆస్పత్రిని ఆదివారం మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీ బృందం(ఎంసీఎంసీ) సభ్యులు సందర్శించారు. వైద్యకళాశాల, అనుబంధ బోధన ఆసుపత్రిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం, హాస్టల్‌ బిల్డింగ్‌, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌ క్వార్టర్స్‌, అతిథిగృహం త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బోధన ఆస్పత్రిని తనిఖీ చేసి సదుపాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్‌ శివరాంప్రసాద్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, డాక్టర్‌ దావూద్‌ సులేమాన్‌, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ బి.లక్ష్మీనారాయణ, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement