సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు | - | Sakshi
Sakshi News home page

సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు

Dec 16 2025 4:41 AM | Updated on Dec 16 2025 4:41 AM

సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు

సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు

● చీమకుర్తి మండలం రామతీర్థం నుంచి బిల్లులు లేకుండా అధిక లోడులతో వస్తున్న గ్రానైట్‌ లారీలను అరికట్టకుండా రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని చీమకుర్తికి చెందిన బీజేపీ నాయకుడు గుండా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరికొందరు ఫిర్యాదు చేశారు. ఒక లారీకి ఒకే రోజు రెండు సార్లు ఫైన్లు వేసిన ఎంవీఐ జగదీష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సంతకాన్ని ఫోర్టరీ చేసి తానిచ్చిన ఫిర్యాదును క్లోజ్‌ చేసిన రవాణా శాఖ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ● మద్దిపాడు మండలంలో ఉన్న 31 రేషన్‌ దుకాణాల్లో పరిమితికి మించి కొన్ని రేషన్‌ దుకాణాలలో కార్డులు ఉన్నందున రేషన్‌ దుకాణాలలో విభజించి నిరుద్యోగులకు అవకాశం కల్పించవలసినదిగా కలెక్టర్‌ను కోరారు. ● నాగులుప్పలపాడు మండలం కండ్లగంటు గ్రామ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలకు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని కండ్లగుంటకు చెందిన పాలపర్తి సతీష్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. గతంలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా

ఒంగోలు సబర్బన్‌:

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 264 మంది అర్జీలు అందజేశారు.

ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు చెప్పినా ప్రయోజనాంలేదన్నారు. మంచినీటికి పైపులైన్‌ ఏర్పాటు చేసి కాలనీ ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు.

అర్జీలు నిర్ణీత గడువు లోగా

పరిష్కరించాలి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కారించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలస్వతం ఉండరాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, కుమార్‌, జాన్సన్‌, కళావతి, విజయజ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement