సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

May 5 2025 8:16 AM | Updated on May 5 2025 8:16 AM

సార్వ

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

చీమకుర్తి: దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం చీమకుర్తిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు పావులు కదుపుతోందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్‌లను తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అందుకు నిరసనగా చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం

గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి

ఎమ్మెల్సీ కుంభా రవిబాబు

ఒంగోలు వన్‌టౌన్‌: మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఒంగోలు అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మైదాన ప్రాంత గిరిజన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం రాష్ట్రంలో జనాభా 4.32 కోట్లయితే.. వారిలో ఎస్టీలు 25,34,795 మంది ఉన్నారన్నారు. ఎస్టీల్లో ప్రధానంగా యానాదులు, చెంచులు, ఎరుకలు, సుగాలీలు, కమ్మర్లు, కొండదొరలు, కోయలు, జాతాపులు, కోర్లు, సవర్లు, కొండ రెడ్లు, బగతలు.. ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు. వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలో కమ్మ రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం ఇస్తున్న 7 అసెంబ్లీ సీట్లను ఏజెన్సీ ప్రాంత ఎస్టీలకే ఇస్తున్నారన్నారు. మైదాన ప్రాంతం వారిని పట్టించుకోవడంలేదన్నారు. రాయలసీమ, కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని మైదాన ప్రాంతాల గిరిజనులకు ఎస్టీ నియోజకవర్గాలను రిజర్వు చేయడం లేదన్నారు. ప్రధానంగా యానాదులు, ఎరుకలు, సుగాలీలు, చెంచులు, కమ్మర్లు తదితరులు వారిలో ఉంటారన్నారు. యానాదులు, ఎరుకలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఎస్టీలలో అత్యధికంగా యానాది కులస్తులు ఉన్నారని తెలిపారు. 5 లక్షల మందికిపైగా వారు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ఐటీడీఏ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందించాలన్నారు. ఎస్టీలకు రాజకీయ ప్రాతిఽనిధ్యం ఉండాలన్నారు. కార్యక్రమంలో బక్కా పరంజ్యోతి, పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 1
1/1

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement