ఏడాది శోకాలు! | - | Sakshi
Sakshi News home page

ఏడాది శోకాలు!

May 30 2025 12:43 AM | Updated on May 30 2025 1:00 AM

ఏడాది

ఏడాది శోకాలు!

పారని పథకాలు..

టంగుటూరు మండలం జమ్ములపాలెంలో నిరుపయోగంగా సచివాలయం, ఆర్బీకే, హెల్త్‌ క్లినిక్‌ భవనాలు

నెల మొదటి తేదీ సూర్యోదయానికంటే ముందే వలంటీర్లు ఇంటి తలుపుతట్టి పింఛన్‌ ఇచ్చేవారు. 50 ఇళ్లకో వలంటీరు ద్వారా సకల సేవలూ అందేవి. కూటమి పార్టీలు వారిని సంఘ విద్రోహశక్తుల్లా అభివర్ణించాయి. అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకు మంగళం పాడేశాయి. విచిత్రమేమిటంటే వలంటీర్లకు ఒక మంత్రి కూడా ఉన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా ఉచితంగా ఇంటి సమీపంలోనే అందేవి. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనితప్పింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అవి కళతప్పాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఐదేళ్లు జిల్లా వ్యాప్తంగా 59,30,289 సేవలు అందాయి. పల్లెల్లో ఆర్‌బీకేలు, సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భవనాలు నిర్మించింది. చాలా ప్రాంతాల్లో అవి వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతుండటం గమనార్హం. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు మొక్కుబడిగా సేవలందుతున్నాయి. దీంతో పల్లెలు కళతప్పాయి. సేవలు మృగ్యమై జనం కంట కన్నీరుకారుతోంది.

ఏడాది పాలన

ఏడాది శోకాలు! 1
1/1

ఏడాది శోకాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement