
రైతుకు దక్కని భరోసా..
జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటికి జిల్లా వ్యాప్తంగా 593 భవన నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.12,553.40 లక్షల అంచనాలతో నిధులు మంజూరు చేయగా, 400 భవనాలు పూర్తయ్యాయి. మిగతా భవనాలు పురోగతిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద దాదాపు 3 లక్షల మంది రైతులకు నాలుగు విడతలుగా రూ.13,500ను నేరుగా వారి ఖాతాలకు జమచేసేవారు. రైతులకు నిత్యం అవగాహన కార్యక్రమాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి. అన్నదాతతో అనుబంధం పెంచుకున్న రైతు భరోసా కేంద్రం నిర్జీవమైపోయింది. అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క పైసా విదిల్చలేదు. పండించిన పంటలకు మద్దతు ధర లభించక అప్పుల పాలై రైతులు రోడ్డున పడుతున్నారు.
పేదల పిల్లలు ఆంగ్లం నేర్చుకోకూడదా.?
కూటమి ప్రభుత్వం వచ్చాక పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అందకుండా చేస్తోంది. 2019 వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకోవాలంటే ధనికుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని పేదలకు ఆంగ్ల మాధ్యమం చేతికందిన అమృత ఫలంలా మారింది. దానిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం రద్దు చేసి పేదలకు అందని ద్రాక్షలా చేసింది. – ఇందూరి దేవి, కురిచేడు
ఆర్బీకేలు అన్నదాతకు అండగా నిలిచాయి
రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు అండగా నిలిచాయి. క్షేత్రస్థాయిలోనే రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందజేసి అన్ని రకాల సేవలు ఒకేచోట లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. పెట్టుబడి నిధులు మంజూరు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట పండించక ముందే ఆయా పంటలకు మద్దతు ధర, విపత్తుల సమయంలో బీమా సౌకర్యం, ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. రైతులను అన్ని విధాలుగా కూటమి ముంచేసింది.
– వెన్నపూస మాల్యాద్రిరెడ్డి, రైతు, చెన్నిపాడు, పొన్నలూరు

రైతుకు దక్కని భరోసా..

రైతుకు దక్కని భరోసా..