మహా మేతగాళ్లు | - | Sakshi
Sakshi News home page

మహా మేతగాళ్లు

May 4 2025 7:03 AM | Updated on May 4 2025 7:03 AM

మహా మ

మహా మేతగాళ్లు

కూటమి నేతలు..

నదీగర్భాలను ఇసుకాసురులు

కుళ్లబొడిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, అక్రమార్కులు ఒక్కటై కొండపి

నియోజకవర్గంలో పాలేరు, మన్నేరు, అట్లేరు నదులపై రాబందుల్లా వాలిపోయారు. భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుక

తవ్వకాలు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అధికారం చేతిలో ఉందికదా అడిగేవాళ్లెవరు అంటూ రెచ్చిపోయారు. నిబంధనలు

అతిక్రమించి నిత్యం వేలాది ట్రాక్టర్లలో వేల టన్నుల ఇసుకను దోచేశారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా సహజ సంపదను కొల్లగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల

కనుసన్నల్లో జరుగుతున్న దోపిడీపై

అధికారులు కిమ్మనడంలేదు.

మంత్రి ఇలాఖాలో ఇసుక దోపిడీ

సాక్షాత్తు మంత్రి స్వామి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి, సింగరాయకొండ మండలాల్లో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో స్థానికులు ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడంలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ట్రాక్టర్లకు అక్రమంగా ఇసుకను లోడ్‌ చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల వరకే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లాలన్న నిబంధన ఉన్నా జరుగుమల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఒంగోలుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మైనింగ్‌, పోలీసు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై అధికారులకు సవాల్‌ విసురుతున్నా. రీచ్‌ల వద్దకు వెళదాం. అక్రమ దందాను నిరూపిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకునే దమ్ముందా..? ఆ ప్రాంతంలో పహారా పెడతారా... ప్రభుత్వ ఖనిజాలు దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా. అక్రమ ఇసుక మైనింగ్‌ జరుగుతోంది. ప్రభుత్వ ధనం లూటీ అవుతోంది. గతంలో ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వచ్చేది. ఖనిజ సంపదకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

– డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఇసుక దందాకు తెరతీశారు. కౌంటింగ్‌ పూర్తయిన క్షణం నుంచే పచ్చనేతలు రెచ్చిపోయారు. జిల్లాలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతమున్న ఈ నియోజకవర్గంలోని సహజ వనరులపై కన్నేశారు. మొదట్లో జరుగుమల్లి మండలం సతుకుపాడు వద్ద ప్రభుత్వం ఇసుక స్టాకు పాయింట్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడ టన్ను రూ. 275 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ట్రాక్టరు ఇసుకకు రూ.1500 చెల్లించి బయట మార్కెట్‌లో రూ. 5000 లకు విక్రయిస్తూ దోపిడీని షురూ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో రాత్రి పూట అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ మామూళ్ల మత్తులో అడ్డగించలేకపోయారన్న ప్రచారం జరిగింది. అడపాదడపా అధికారులు అడ్డగించినా వారికి పనిచేసుకుంటావా లేక బదిలీ చేయాలా అన్న బెదిరింపులకు దిగారు అధికార పార్టీ నేతలు.

నిబంధనలు మీరి...

తమ పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చని ఎవరూ ఆపవద్దని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఇసుక కోసం వాహనం తీసుకుని నది వద్దకు వెళితే పచ్చనేతలు ట్రాక్టరుకు లోడింగ్‌ చేసిన దానికి రూ.300, తమ వాటా రూ.500 మొత్తం రూ.800 చెల్లించి మరీ ఇసుక తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేమని అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ట్రాక్టరును సీజ్‌ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక నదుల్లో మనుషులతోనే ఇసుకను ట్రాక్టరుకు లోడ్‌ చేయాలి తప్ప యంత్రాలను వాడకూడదన్న నిబంధనను కూడా టీడీపీ నేతలు గాలికి వదిలేశారు. యథేచ్ఛగా యంత్రాల ద్వారా ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. నదీపరివాహక ప్రాంతం నుంచి ఇంటి అవసరాలకు వాడుకోవాలే తప్ప వ్యాపారం చేయకూడదన్న నిబంధన కూడా ఉంది. కానీ దానిని ఒక్కరోజు కూడా అమలు కాలేదు. ప్రతి రోజు జరుగుమల్లి నుంచి 30 కిలోమీటర్లు ఉన్న ఒంగోలుకు రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఒంగోలు పరిధిలో ఇసుక స్టాకు పాయింట్‌లు ఉన్నప్పటికీ జరుగుమల్లి నుంచే ఇసుక అక్రమ రవాణా జరగటంతో అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయిఇటీవల ఒంగోలు, కొండపి లోని పచ్చపార్టీకి చెందిన అధినాయకుల అండదండలతో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య గొడవలు జరిగిన సంగతి విదితమే.

అధికార పార్టీ నేతలు అనుమతులు

ఇవ్వాలి..

జరుగుమల్లి మండలం కామేపల్లి, సతుకుపాడు ప్రాంతంలో టీడీపీ నాయకుల ట్రాక్టర్లకే ఇసుక లోడింగ్‌ జరుగుతుంతోందని, ఇతరులు వెళితే టీడీపీ నేతల అనుమతి తప్పనిసరి తెలుస్తోంది. దీంతో కాలువలు, నదుల్లో ఇసుకను ఉచితంగా ఏవిధంగా తీసుకుని వెళ్లాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అంతేకాక ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే రోడ్లన్నీ ధ్వంసమై ద్విచక్ర వాహనాలపై పొలాలకు వెళ్లలేకపోతున్నామని దీంతో కిలోమీటర్ల దూరం నడిచి పోవాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయా మండలాల పరిధిలో భూగర్భ జలాలు అడుగంటాయని, రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

సుమారు రూ.100 కోట్ల విలువైన ఇసుక మింగేశారు కొండపి నియోజకవర్గంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా పాలేరు, మన్నేరు, అట్లేరు నదుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు టీడీపీ అధినాయకుని కనుసన్నల్లో అక్రమ రవాణా 24 గంటలు ఇసుక తరలిపోతున్నా చోద్యం చూస్తున్న అధికారులు నియోజకవర్గంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

చోద్యం చూస్తున్న అధికారులు

ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్‌, పోలీసు, రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాత్రి పూట టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగగా, ప్రస్తుతం 24 గంటలూ ట్రాక్టర్ల ద్వారా దందా జోరుగా సాగుతోందని ప్రచారం. ప్రస్తుతం జరుగుమల్లి నుంచి ఒంగోలుకు ప్రతిరోజు సుమారు 300 వరకు, కామేపల్లి నుంచి కొండపి, ఇతర ప్రాంతాలకు సుమారు 300, పొన్నలూరు మండలం వేంపాడు, ఉప్పలదిన్నెప్రాంతాల నుంచి సుమారు 300, సింగరాయకొండ మండలం మన్నేరు, కొండపి మండలం అట్లేరు నుంచి సుమారు 100 కు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరల ఆధారంగా ఇప్పటి వరకూ నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఇసుక దందా సాగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మహా మేతగాళ్లు1
1/1

మహా మేతగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement