
కార్మికుల పక్షపాతి.. వైఎస్ జగన్
● మే డే వేడుకల్లో వైఎస్సార్ సీపీ నాయకులు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో కార్మికులకు ఎంతో మేలు చేశారని ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. మే డే సందర్భంగా గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక పక్షపాతి అని కొనియాడారు. తన హయాంలో అన్ని వర్గాల ఆర్థిక ప్రగతి కోసం నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులు శతాబ్దాలుగా పనిచేస్తున్నా వాళ్లు కార్మికవర్గ ఆలోచనా విధానానికే కట్టుబడి పనిచేశారన్నారు. అదే క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా దాదాపు 2 లక్షల 75 వేల కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలోని పేదలకు అందించి తాను పేదల వైపు ఉన్నానని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల కోసం ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారన్నారు. కార్మిక దృక్పథంతో పనిచేస్తున్న వైఎస్సార్ సీపీవైపే ప్రజలు నిలబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, కె.వి.ప్రసాద్, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు రొండా అంజిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వర్లు, పాలడుగు రాజీవ్, పులుసు సురేష్బాబు, దేవ, శ్రీకాంత్, సన్నీ, పీటర్, రవీంద్రనాథ్రెడ్డి, మహేష్, కె.కోటియాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు పేరం ప్రసన్న, ఫాతిమా, మేరీకుమారి, వి.వాణి, బడుగు ఇందిర, నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.