గింజకున్నా కొనట్లేదు! | - | Sakshi
Sakshi News home page

గింజకున్నా కొనట్లేదు!

May 1 2025 1:08 AM | Updated on May 1 2025 1:08 AM

గింజకున్నా కొనట్లేదు!

గింజకున్నా కొనట్లేదు!

సాక్షిప్రతినిధి, ఒంగోలు:

జిల్లా వ్యాప్తంగా 32,425 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అందుకుగాను 76,397 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అందులో కేవలం 10 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలన్నది లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ నిర్ణయించింది. జిల్లాలోని 27 మండలాల్లో 239 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 8,900 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దిగుబడి వచ్చిన దానిలో సగానికి పైగా ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధర రాకుండానే దళారులకు తెగనమ్ముకున్నారు. ఫలితంగా ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచి 25 నుంచి 30 శాతం అయినా కొనుగోలు చేస్తే రైతుకు కనీసం ఖర్చులైనా వస్తాయని చెబుతున్నారు. అప్పుడు రైతు కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉండేది.

ప్రతికూల వాతావరణం...తీవ్ర నష్టం..

మరో పక్క వాతావరణం ప్రతి కూలించటంతో పాటు గాలీ, వాన బీభత్సం, వడగళ్ల వర్షం అన్నదాతను ఉక్కిరి బిక్కిరి చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కురిసిన వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతింది. పంట నష్టం సంభవించిన దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయే కానీ రైతుకు ఒరిగింది మాత్రం శూన్యం. పంట చేతికొచ్చిన దశలో ఇలాంటి ఇబ్బందులు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ అవకాశం కూడా కల్పించలేదు. దీనికితోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మాలంటే రైతులు అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డబ్బులు పెట్టుబడి పెట్టుకుని మిల్లుకు ధాన్యం రవాణా చేయాల్సి రావడం రైతుకు ఇబ్బందిగా మారింది. ఈ వరిస్థితుల్లో పలువురు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు దళారులు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ–క్రాప్‌ విధానంలో నమోదు చేసుకోని పంటను తక్కువ ధరకు అడుగుతున్నారు.

రైతుకు దక్కని ధాన్యం మద్దతు ధర దిగుబడిలో 10 శాతం కూడా కొనుగోలు చేయని వైనం దళారీల చేతుల్లో దోపిడీకి గురవుతున్న అన్నదాత అందినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిలో రైతు ప్రభుత్వం నుంచి అందని సాయం ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అలా.. కూటమిలో ఇలా..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అప్పటి రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా విక్రయించుకోవాలని కోరుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు రైతుల చుట్టూ తిరిగేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. తమ ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనాలని, గోనె సంచులు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తూ వచ్చింది.

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా మోసం..

10 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ప్రభుత్వం మద్దతు ధర రూ.2320 చొప్పున కొనుగోలు చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను. తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. దీంతో పంటను దళారులకు అత్యంత చవకగా అమ్ముకోవాల్సి వచ్చింది. వరి రైతులను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది.

– కన్నెదారి వెంకటేశ్వర్లు, దాసరివారిపాలెం, నాగులుప్పలపాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement