
ఎయిడెడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి
ఒంగోలు సిటీ: జిల్లాలో జీరో ఎన్రోల్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 49 మంది ఉపాధ్యాయులకు శాశ్వతంగా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి కోరారు. డీఈఓ కార్యాలయంలో బుధవారం ఏడీ వరప్రసాద్ను కలిసి ఎయిడెడ్ టీచర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్టూరు మండలం, రాజుపాలెం ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రభుత్వంలో విలీనమైందని, అక్కడ పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పై సమస్యలను సత్వరమే పరిష్కరించి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని జిల్లా బాధ్యులు కోరారు.
పాలిసెట్కు 5,387 మంది హాజరు
ఒంగోలు సిటీ: పాలిసెట్ పరీక్షను బుధవారం 11 కేంద్రాల్లో నిర్వహించారు. ఒంగోలులో 7 కేంద్రాలు, మార్కాపురంలో 4 కేంద్రాల్లో పరీక్ష జరిగిందన్నారు. మొత్తం 4600 మంది విద్యార్థులకు గాను 3950 మంది పరీక్షకు హాజరయ్యారని, 85.86 శాతం హాజరు నమోదైందని ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలురు 2932 మందికి గాను 2557 మంది పరీక్షకు హాజరుకాగా, 375 మంది గైర్హాజరయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1668 మంది బాలికలకు గాను 1393 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా, 275 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
మెప్మా మిషన్ మేనేజర్ కల్పన సస్పెన్షన్
ఒంగోలు సబర్బన్: జిల్లా మెప్మా కార్యాలయంలో మిషన్ మేనేజర్ గుట్లపల్లి కల్పనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఆ శాఖ మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భారతి ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. మదర్ థెరిస్సా వికలాంగుల సేవా సమితి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిషన్ మేనేజర్పై విచారణ చేపట్టారు. ఆమె అక్రమాలకు పాల్పడినట్లు మెప్మా పీడీ, ప్రత్యేక కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని, ఆ స్థానానికి ఇన్చార్జ్ని నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
● వాటిలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు
● వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల (ఎంఎన్జీయూ) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులతో బుధవారం సమావేశమయ్యారు. జిల్లాలోని గిద్దలూరు, వై.పాలెం, కొండపి, మార్కాపురం, రిమ్స్ ఆస్పత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మెడికల్ అధికారులతో సమీక్షించి తగు సూచనలు ఇచ్చారు. జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడం, పుట్టిన బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ నిర్మల్ కుమార్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రావ్య, గిద్దలూరు, వై.పాలెం, కొండపి, మార్కాపురం ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.

ఎయిడెడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి