
పరిశీలకులుగా బత్తుల, జంకె, కదిరి
వైఎస్సార్ సీపీ ఒంగోలు, నెల్లూరు, విశాఖ పార్లమెంట్ల
ఒంగోలు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం పార్లమెంట్లకు పార్టీ పరిశీలకులను నియమించారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకునిగా బత్తుల బ్రహ్మానంద రెడ్డిని నియమించారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు అనుసంధానంగా ఆయన పనిచేస్తారు. అదేవిధంగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకునిగా నియమించారు. జంకె వెంకట రెడ్డి గతంలో ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షునిగా పనిచేశారు. రెండుసార్లు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్గా పనిచేశారు. వైఎస్సార్ సీపీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకుడిగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును నియమించారు.