బాధ్యతగా పనిచేస్తేనే రైల్వేకు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పనిచేస్తేనే రైల్వేకు ఆదాయం

Apr 30 2025 12:23 AM | Updated on Apr 30 2025 12:23 AM

బాధ్య

బాధ్యతగా పనిచేస్తేనే రైల్వేకు ఆదాయం

దొనకొండ:

రైల్వే శాఖలో ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వెంకటరామిరెడ్డి తెలిపారు. స్థానిక రైల్వే ఫంక్షన్‌ హాల్లో మంగళవారం రైల్వే శాఖ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరు, ఇతర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రైల్వే స్టేషన్లను రెండు నెలలకోసారి తనిఖీ చేస్తున్నామన్నారు. దొనకొండ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను రైల్వే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించినపుడే రైల్వే శాఖకు ఆధాయం సమకూరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులను సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సైమన్‌, సీఎస్‌ఈ భూపనిసింగ్‌, సీఈడీఈ తోరియా, సీఈటీఎస్‌ మోనికా వర్మ తదితర ఉన్నతాధికారులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతగా పనిచేస్తేనే రైల్వేకు ఆదాయం 1
1/1

బాధ్యతగా పనిచేస్తేనే రైల్వేకు ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement