
ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా పాలకవర్గం ఏకగ్రీవ
ఒంగోలు సిటీ: ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి నెల్లూరు జిల్లా ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.కిరణ్ కుమార్ తెలిపారు. నగరంలోని ఫైనాన్సియల్ కాంప్లెక్స్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడి గా మార్కాపురం సబ్ ట్రెజరీ అధికారి ఎన్వీ కృష్ణ, కార్యదర్శిగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న పీ అంక బాబు, సహాధ్యక్షునిగా గిద్దలూరు సబ్ ట్రెజరీ అధికారి పీవీఎల్ఎన్ వరకుమార్, మహిళా ఉపాధ్యక్షురాలిగా జిల్లా ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న కే లావణ్య, ఉపాధ్యక్షులుగా జిల్లా ట్రెజరీ లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేస్తున్న బీ అక్కేశ్వర రావు, పొదిలి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఎస్కే కరిముల్లా, కే వెంకటేశ్వర్లు, మహిళా సంయుక్త కార్యదర్శులుగా జిల్లా ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న పీ హేమలత, మిగతా సంయుక్త కార్యదర్శులుగా కనిగిరి సబ్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న కే ప్రసాద్ చంద్ర, యర్రగొండపాలెంలో జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న డీ అనిల్, కోశాధికారిగా జిల్లా ట్రెజరీ లో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న కే రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కందుకూరు సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న సీహెచ్ ఫణీంద్ర, జిల్లా ట్రెజరీలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న ఐ కిషోర్ బాబు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉప ఎన్నికల అధికారిగా సీహెచ్ విజయ కృష్ణ, పరిశీలకులు గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డి.రమణా రెడ్డి వ్యవహరించారు. రాష్ట్ర నాయకులు పాముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.