
ముండ్లమూరు చిన్నారికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు
ముండ్లమూరు (కురిచేడు): సంగీతంలో ఓ పదకొండేళ్ల చిన్నారి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ముండ్లమూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న బి.ప్రేమానిధి కుమారుడు మణిరత్నపాల్ నిధి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. విజయవాడ హలెల్ మ్యూజిక్ స్కూలు ద్వారా సంగీతం నేర్చుకున్నాడు. గత డిసెంబరు నెలలో డీ అగస్టీన్ ఆధ్వర్యంలో 18 దేశాలలో 1,046 మందితో జరిగిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పోటీల్లో పాల్గొన్నాడు. తన స్వరాలు ఆలపించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. విజయవాడలోని మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో శుక్రవారం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును హలెల్ మ్యూజిక్ స్కూలు అధినేత డీ అగస్టీన్ దంపతుల చేతుల మీదుగా అందుకున్నాడు.
గిన్నిస్ బుక్లో జాషువా పేరు నమోదు
మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్లో డయాలసిస్ ఇన్చార్జిగా పనిచేస్తున్న దారా జాషువా అలియాస్ కుమార్ గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 1న విజయవాడలో జరిగిన ప్రపంచ స్థాయి సంగీత ప్రదర్శనలో హలెల్ మ్యూజిక్ స్కూల్ సంగీత కళాకారుల బృందం ఆధ్వర్యంలో జాషువా కీ బోర్డులో స్వరాలను 45 సెకన్లలో స్వరపరిచి గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఈ నెల 25న విజయవాడలో జరిగిన గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో పాస్టర్ అగస్టీన్ చేతుల మీదుగా మెడల్, గిన్నిస్ ధ్రువీకరణపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను చర్చి సభ్యులు, క్రైస్తవ సంఘాల సభ్యులు అభినందించారు.

ముండ్లమూరు చిన్నారికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు