
కూటమి ప్రభుత్వంలో విధ్వంసక పాలన
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
పొన్నలూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దాడులు, కేసులతో విధ్వంసక పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సావాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఓట్లతో గెలిచిన తరువాత చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలపై, సామాన్య ప్రజలపై దాడులు, కేసులు తప్పా అభివృద్ధి, సంక్షేమం శూన్యమన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి పార్టీ నేతలకే రాష్ట్రంలో రక్షణ కరువైందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దాడులు, కేసులు, అరాచకాలు, అవినీతి, ఊరూరా బెల్ట్ షాపుల తప్పా అన్ని వర్గాల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనను ప్రజలు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మేధావులు గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారన్నారు. మళ్లీ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, సర్పంచ్ లెక్కల కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాచరణ కార్యదర్శి కాటా మాధవరావు, కొండపి నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు వరికూటి రామిరెడ్డి, వరికూటి బ్రహ్మారెడ్డి, లెక్కల వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వరికూట నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఎనిమిరెడ్డి తిరుపాల్రెడ్డి, సర్పంచ్ మార్తాల వెంకటేశ్వరరెడ్డి, కాటా మల్లికార్జునరావు, దగ్గుమాటి శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రత్యేకంగా యువ ప్రకాశం
ఒంగోలు సబర్బన్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఇంటర్న్ షిప్ కోసం జిల్లాలో ప్రత్యేకంగా యువ ప్రకాశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం యువ ప్రకాశం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇతర పథకాల గురించి అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ‘‘యువ ప్రకాశం’’ అనే కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసేందుకు వివిధ అంశాల్లో 30 రోజుల ఇంటర్న్ షిప్ను చేసేందుకు అవకాశం కల్పించించామని చెప్పారు. వాటర్ మేనేజ్మెంట్, హెల్త్, పంచాయతీ రాజ్, ఉపాధి కల్పనా అవకాశాలు, మహిళా, శిశు ఆరోగ్య కార్యక్రమాలు, రోడ్లు అండ్ భవనాల నిర్మాణ రీతులు, నగర అభివృద్ధి కార్యక్రమాలలో శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 14 నుంచి జూన్ 13 వరకు 30 రోజుల పాటు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను మే 8 వ తేదీలోగా ఈ లింక్ ద్వారా హెచ్టీటీపీ//టీఐఎన్వై.సీసీ/జీఎస్ఐపీ కింద తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ ఇంటర్న్ షిప్ నోడల్ అధికారి, ఒంగోలు స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శ్రీమన్నారాయణ తెలిపారు. ఇతర వివరాల కోసం కార్యాలయపు పని వేళల్లో స్వయంగా కానీ, ఫోన్ ద్వారా గానీ 9182891095, 9885544154 సంప్రదించవచ్చన్నారు.
వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్ సౌకర్యం కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

కూటమి ప్రభుత్వంలో విధ్వంసక పాలన