
ప్రభుత్వం దృష్టి సారించాలి..
ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్లుగా తగ్గించేస్తున్నారు. ఇంపోర్టెడ్ మినరల్స్ ధరలు తగ్గాయి. దానికి తోడు సోయా ధరలు కూడా తగ్గాయి. అందుకు అనుగుణంగా రొయ్యల ధరలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇస్తామన్న హామీని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాలి.
– దుగ్గినేని గోపీనాథ్, ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు