టంగుటూరు: మార్కెట్కు అనుగుణంగా పొగాకు రైతులు వేలానికి బేళ్లను తీసుకురావాలని బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్కుమార్ అన్నారు. స్థానిక వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేళ్లను తీసుకువచ్చేటప్పుడు తేమ, వేడి లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. లోగ్రేడ్ పొగాకు, నీళ్లు కట్టిన పొగాకు, మొద్దు పచ్చ రకం పొగాకు వేలానికి తీసుకురావద్దని సూచించారు. వ్యాపారులు నో బిడ్స్ లేకుండా మంచి ధరలతో కొనుగోలు చేసేలా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు,వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు.
వడదెబ్బకు గుర్తు తెలియని వృద్ధుడు మృతి
మార్కాపురం: వడదెబ్బకు గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..వివరాలు దరిమడుగు గ్రామం శివారులో ఒక సమాధి వద్ద సుమారు 70 ఏళ్ల వృద్ధుని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లినట్టు ఎస్సై అంకమరావు తెలిపారు. ఆ వృద్ధుడు బుధవారం ఉదయం నుంచి అదే ప్రాంతాల్లో తిరిగినట్టు స్థానికులు తెలిపారని, ఒంటిపై షర్టు ప్యాంటు ఉందని, వడదెబ్బకు మృతి చెందినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. స్థానికులు ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం తెలపాలని ఎస్సై తెలిపారు.
35 వాహనాలు సీజ్
కనిగిరిరూరల్: మైనర్ల డ్రైవింగ్పై గురువారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ పి.సాయిఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో మైనర్లు నడుపుతున్న 35 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ మాట్లాడుతూ ప్రమాదాల నుంచి మైనర్లను కాపాడేందుకు ఈ డ్రైవ్ చేపట్టామన్నారు. సీజ్ చేసిన బైక్ డేటాను స్టేషన్లలో భద్రపరుస్తామన్నారు. మళ్లీ మైనర్స్ బైక్ డ్రైవింగ్లో దొరికితే ఈ సారి వారి తల్లి దండ్రులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్ల డ్రైవింగ్పై వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ ఎస్కే ఖాజావలి, ఎస్సై మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించండి
● డీఆర్డీఏ పీడీ నారాయణ
మార్కాపురం టౌన్: ఎస్హెచ్జీ గ్రూపులు తీసుకున్న రుణాలను వెంటనే బ్యాంకులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. పట్టణంలోని డ్వాక్రా బజారులో గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం క్లస్టర్ల పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఏఓలు మహిళల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డీఆర్డీఏ ద్వారా అందిస్తున్న సేవలను, పథకాలను మహిళలకు వివరించాలన్నారు. సీ్త్రనిధి, ఉన్నతి పథకాల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. సెర్ఫ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తూ ఎస్హెచ్జీ గ్రూపులను యాక్టీవ్ చేయాలన్నారు. కార్యక్రమంలో సీ్త్రనిధి ఏజీఎం హర్షవర్ధన్, ఏరియా కో ఆర్డినేటర్ సుధాకర్, డీపీఎం సుబ్బారావు, మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల ఏపీఎంలు పిచ్చయ్య, రమేష్బాబు, గోపాల్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్కి అనుగుణంగా బేళ్లను తీసుకురావాలి