
వీధి కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సిందే
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను విధిగా చేపట్టాలని రీజినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) హరికృష్ణ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం ఒంగోలు వచ్చిన సందర్భంగా నగరంలో ఆయన పర్యటించారు. స్థానిక కొత్తమామిడిపాలెంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసిన షల్టర్, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. జిల్లాలో మిగిలిన యూఎల్బీల నుంచి కూడా వీధి కుక్కలను ఆపరేషన్ల కోసం ఇక్కడికి తీసుకొస్తున్నారని ఆర్డీఎంఏ దృష్టికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తీసుకెళ్లారు. వాటి కోసం ఇంకొన్ని బోనులను ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీఎంఏ హరికృష్ణ ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 25 కుక్కలకు ఆపరేషన్లు చేస్తున్నారని కమిషనర్ తెలపగా, కుక్కలను పట్టుకోవడానికి ఉపయోగిస్తున్న వలలను ఆర్డీఎంఏ హరికృష్ణ పరిశీలించారు. అనంతరం అదే ఆవరణలోని వర్మీకంపోస్ట్ కేంద్రాన్ని పరిశీలించారు. దానిని వెంటనే వాడుకలో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆవరణ ప్రాంగణంలోనే తడి చెత్తను కంపోస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ పార్కును సందర్శించారు. పార్కులో గ్రీనరీని చూసి ఇలాంటి పార్కులను నగరంలో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, వైష్ణవి, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, సెంటర్ ఇన్చార్జి సూపర్వైజర్ బాబ్జి, కుక్కల ఆపరేషన్ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు.
పార్కును
పరిశీలిస్తున్న
ఆర్డీఎంఏ
హరికృష్ణ,
ఒంగోలు
నగరపాలక
సంస్థ
అధికారులు
ఒంగోలు నగరంలో పర్యటించిన
ఆర్డీఎంఏ హరికృష్ణ