
చీకటి దారుల్ని వెలిగించే పుస్తకాలు
ఒంగోలు టౌన్: పుస్తకాలు జీవితంలోని చీకటిదారులను వెలిగించే దీపాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం పుస్తకాలను ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పుస్తకాలను చదవడం ఎంతో మంచి అలవాటని, దీని వల్ల మెదడు క్రియాశీలకంగా పనిచేస్తుందని, మానసిక వికాసాన్ని పెంపొదిస్తుందని తెలిపారు. ప్రపంచంలో పుస్తకాలు చదివి చెడిపోయిన వాళ్లు లేరని, విజేతలుగా ప్రసిద్ధి చెందిన వారంతా పుస్తకాలను చదివిన వారేనని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఉప పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది కృష్ణవేణి, శివకుమారి, శాంసన్, మృదుల్ కుమార్, ఇమ్మానుయేలు పాల్గొన్నారు.