విద్యుదాఘాతానికి ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి ఇద్దరు దుర్మరణం

Apr 23 2025 9:39 AM | Updated on Apr 23 2025 9:30 PM

విద్యుదాఘాతానికి ఇద్దరు దుర్మరణం

విద్యుదాఘాతానికి ఇద్దరు దుర్మరణం

పెద్దదోర్నాల:

వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి చెందారు. నివాసగృహంలో ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తుండగా చేతికి వైర్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గంటవానిపల్లెలో సోమవారం జరిగింది. ఘటనలో యలకపాటి ఏసుదానం (40) మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు .. యలకపాటి ఏసుదానం తన ఇంట్లోని టేబుల్‌ ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తుండగా హై ఓల్టేజీ వచ్చింది. ఈ క్రమంలో ఫ్యాన్‌ వైర్‌ చేతికి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకుతరలించారు. మృతునికి భార్య, కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏసుదానం మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మార్కాపురం: విద్యుదాఘాతానికి వెస్ట్‌ బెంగాల్‌ కార్మికుడు మృతి చెందాడు. రూరల్‌ ఏఎస్సై శ్రీనివాసరావు వివరాల మేరకు..వెస్ట్‌బెంగాల్‌రాష్ట్రం లోని మాల్దా జిల్లా లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన షేక్‌ రబూల్‌ (24) విద్యుత్‌ కార్మికునిగా పనిచేస్తూ ఇటీవల మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామం వద్ద జరుగుతున్న 11 కేవీ విద్యుత్‌లైను పనులకు వచ్చాడు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం పనిచేస్తుండగా తీగలకు విద్యుత్‌సరఫరా వచ్చి షాక్‌కు గురయ్యాడు. వెంటనే జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement