చీమకుర్తి: వచ్చే నెలలో జరగనున్న రామతీర్థం తిరునాళ్లను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు. చీమకుర్తిలోని బూచేపల్లి కార్యాలయంలో గురువారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 11వ తేదీన చీమకుర్తిలో మందిరాల సంబరాలు, 12వ తేదీన రామతీర్థంలో గంగమ్మ తిరునాళ్ల వేడుకలు జరుగుతున్నట్లు తెలిపారు. ఏటా ఆనవాయితీగా వైఎస్సార్ సీపీ తరుఫున ఏర్పాటు చేయనున్న విద్యుత్ప్రభల నిర్మాణంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న రామతీర్థంలోని గంగమ్మ ఆలయంలో పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, చేనేత సొసైటీ జిల్లా నాయకులు సోమా యానాదిశెట్టి, కౌన్సిలర్లు బీమన వెంకట్రావు, గోపురపు చంద్ర, సోమా శేషాద్రి, తప్పెట బాబూరావు, గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, పాలపర్తి వెంకట్రావు, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, అవ్వారు ఆదినారాయణ, షేక్ ఖాదర్బాషా, స్థానికులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి విజ్ఞప్తి