‘కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే’ | revanth reddy election campaign in jubileehills by election | Sakshi
Sakshi News home page

‘కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే’

Nov 5 2025 9:12 PM | Updated on Nov 5 2025 9:18 PM

revanth reddy election campaign in jubileehills by election

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ని కేసీఆర్‌ బీజేపీకి తాకట్టుపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. ప్రధాని మోదీకి ఇస్తున్న కేసీఆర్‌ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే.కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైంది.

ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సోనియా,రాహుల్‌ను ఈడీ విచారించింది. కేసీఆర్‌,కేటీఆర్‌,హరీష్‌ను ఎందుకు పిలవలేదు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనమయ్యే పరిస్థితి ఉంది’అని పునరుద్ఘాటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement