
పాట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డారు. పీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ బీహార్లోని ఆరా జిల్లాలో బద్లావ్ సభకు రోడ్ షోగా వెళ్లారు. ఈ సమయంలో ఆయన పక్కటెముక భాగంలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో, పీకే విలవిల్లాడిపోయారు. అనంతరం, వైద్య చికిత్స కోసం పీకేను పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, ఆయన గాయంతో బాధపడుతూ నడవలేకపోతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది.
Arrah, Bihar: Jan Suraaj Founder Prashant Kishor suffered an injury in his ribs during his roadshow in Arrah today. He was brought to the party's stage following the injury.#PrashantKishore pic.twitter.com/gaG4V0kmVs
— 𝑺𝒂𝒊𝒚𝒂𝒂𝒓𝒂✨️ (@sam303T) July 18, 2025
आज एक योद्धा बीमार है। "जो नेता जनता के लिए बिना थके चलता रहा, आज थोड़ा थम गया है "ये सिर्फ शरीर की थकान है, आत्मा तो आज भी बिहार के लिए लड़ी जा रही है।प्रशांत किशोर की तबीयत गिरी है, हौसला नहीं
दुआ करें, वो जल्दी खड़ा हो। 🙏@PrashantKishor @jansuraajonline pic.twitter.com/l531WutJ9S— AY abhishek yadav (@AYabhishek49602) July 18, 2025