కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్‌ గాంధీ

Development Or Destruction Rahul Gandhi Questioned Centre - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధి కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో జరుగుతుంది అభివృద్ధా?.. వినాశానమా? అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరగడం తప్ప దేశంలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదని రాహుల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో ప్రజలు క్రమశి​క్షణ కోల్పోతున్నారని.. రోజు రోజుకీ సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. జీడీపీ కుంటుపడటంతో పాటు దేశ బ్యాంకింక్‌ వ్యవస్థ సమస్యల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందన్నారు. కేంద్రం నిర్ణయాలతో దేశంలో ఆర్థిక​ వ్యవస్థ దిగజారిపోతుందని రాహుల్‌ ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top