కోల్సిటీ: రామగుండం నగరంలో వరుసగా వీధికుక్కల దాడులు చోటుచేసుకుంటున్నాయి. గోదావరిఖని లక్ష్మీనగర్లోని వ్యాపార కూడళ్లల్లో రోడ్లపై సంచరిస్తూ ప్రజలను తరుముతున్నాయి. తాజాగా బోళ్లబజార్లో గురువారం ఓ చిన్నారిపై రెండు వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు స్థానిక జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధికుక్కల దాడులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రోదిస్తున్నబాలిక, కుక్కకాటు


