రేపు పెద్దపల్లి బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు పెద్దపల్లి బంద్‌

Apr 28 2025 12:06 AM | Updated on Apr 28 2025 12:06 AM

రేపు

రేపు పెద్దపల్లి బంద్‌

పెద్దపల్లిరూరల్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా ఈనెల 29న (మంగళవారం) పెద్దపల్లి బంద్‌ పాటిస్తున్నామని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కమల్‌ కిషోర్‌ శారడ, ప్రధాన కార్యదర్శి మస్రత్‌, కోశాధికారి వినోద్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో మాట్లాడారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ సహ, ఆటో, వ్యాన్‌, లారీ అసోసియేషన్‌లు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటాయని పేర్కొన్నారు. బంద్‌తో ప్రజలకు కొంత ఇబ్బంది కలిగినా.. దేశ పౌ రులను ఉగ్రవాదులు బలితీసుకోవడానికి నిరసనగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎల్లంపల్లిలో తగ్గుతున్న నీటిమట్టం

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం సగానికి పైగా తగ్గిపోయింది. ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 356 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్‌ మెట్రోకు 316, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి కేంద్రాలకు మిషన్‌ భగీరథ కోసం 81, 190 క్యూసెక్కులు ఎండకు ఆవిరి అవుతుండగా మొత్తం ప్రాజె క్టు నుంచి 708 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.

మూడురోజులు దరఖాస్తుల పరిశీలన

కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు దరఖాస్తుల పరిశీలన చేయనున్నట్లు కమి షనర్‌ (ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తెలిపారు. సోమవా రం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌ గోదావరిఖని శాఖ, మేడిపల్లి లింగాపురం శాఖ, 8 ఇంక్లయిన్‌కాలనీ శాఖ పరిధిలో దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. మంగళవారం యూ నియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌, మార్కండేయ కాలనీశాఖ, రమేశ్‌నగర్‌ శాఖ పరిధిలోని అభ్యర్థులకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని, బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌, గోదావరిఖని శాఖ, మేడిపల్లి చౌరస్తా శాఖ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జ్యోతినగర్‌ శాఖ, హెచ్‌డీఎఫ్‌ సీ, రామగుండం శాఖ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, గోదావరిఖని శాఖ, ఇండియన్‌ బ్యాంక్‌, ఐసీఐసీసీ బ్యాంక్‌, కేడీసీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకు శాఖల పరిధిలోని అభ్యర్థుల దరఖా స్తుల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ పాన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, ఆహారభద్రత కార్డు, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో షెడ్యూల్‌ ప్రకారం హాజరుకావాలని కోరారు.

రేపు పెద్దపల్లి బంద్‌1
1/1

రేపు పెద్దపల్లి బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement