ధైర్య సాహసాలకు రివార్డు | - | Sakshi
Sakshi News home page

ధైర్య సాహసాలకు రివార్డు

Apr 27 2025 12:11 AM | Updated on Apr 27 2025 12:11 AM

ధైర్య

ధైర్య సాహసాలకు రివార్డు

గోదావరిఖని(రామగుండం): విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఉపేందర్‌, కానిస్టేబుల్‌ సంపత్‌కు శనివారం డీజీపీ జితేందర్‌ హైదరాబాద్‌లో నగదు రివార్డు అందజేశారు. గంజాయి కేసులో నిందితుడు ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి పారిపోతుండగా టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఉపేందర్‌, కానిస్టేబుల్‌ సంపత్‌ ప్రాణాలకు తెగించి కెనాల్‌లో దూకి నిందితుడిని పట్టుకున్నారు. ఇద్దరినీ డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. నార్కోటిక్‌ ఏడీజీ సందీప్‌శాండిల్యా, లాఅండ్‌ఆర్డర్‌ ఏడీజీ మహేశ్‌భగవత్‌, ఏడీజీ పర్సనల్‌ అనిల్‌, నార్కోటిక్స్‌ ఎస్పీ చెన్నూరి రూపేశ్‌ పాల్గొన్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై, కానిస్టేబు ల్‌కు రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ఝా అభినందనలు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌

గోదావరిఖని(రామగుండం): శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ స్పష్టం చేశారు. శనివారం స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు పోలీస్‌శాఖ ఎలా వ్యవహరిస్తుంది? ఘర్షణలకు పాల్పడిన వారిపై ఏ చర్యలు తీసుకుంటారనే అంశాలపై పోలీసులతో మాక్‌డ్రిల్‌ చేపట్టామన్నారు. జన సమూహాలను కంట్రోల్‌ చేసేందుకు మొదటగా హెచ్చరికలు వినకపోతే మెజిస్ట్రేట్‌, ఉన్నతాధికారుల అనుమతితో భా ష్పవాయువు ప్రయోగించడం తదితర అంశాలను ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. గోదావరి ఖని ఏసీపీ ఎం.రమేశ్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్‌, ప్రవీణ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సైలు రమేశ్‌, భూమేశ్‌, ఉదయ్‌కిరణ్‌, మానస, సంధ్యారాణి, వెంకట్‌ ఆర్‌ఎస్సై శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బంద్‌ ప్రశాంతం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): దేశంలో ఉగ్ర మూలాలను అంతం చేయాల్సిందేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం సుల్తానాబాద్‌లో హిందూ ఐక్యవేదిక పిలుపుమేరకు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహించాయి. పట్టణంలో బీజేపీ నాయకులు, హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇస్తున్నవారిని కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు. హిందువులందరూ ఐక్యంగా నిలిచి ముందుకు వెళ్లినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులు ఎస్‌.కుమార్‌, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, గుర్రాల మల్లేశం, కామనీ రాజేంద్రప్రసాద్‌, నాగరాజు, వెంకటేశ్‌, సతీశ్‌, నాగేశ్వర్‌, కొల్లూరి సతీశ్‌, రాజు, కుమార్‌, వనజ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డీపీవో ఆకస్మిక తనిఖీ

రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ గ్రామాన్ని శనివారం జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సందర్శించారు. పంచాయతీలో రికార్డులు పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని సెగ్రిగేషన్‌ షెడ్‌ను పరిశీలించారు. పారిశుధ్య కార్మికులు చెత్తను తడి, పొడిగా విభజించి కంపోస్టు ఎరువు తయారుచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, ఖాళీ స్థలాలకు ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) రుసుము చెల్లించేలా ఓనర్లతో నేరుగా సంప్రదింపులు జరపాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పారిశుధ్య పనులు ఉదయం 11 లోగా, సాయంత్రం 5–7 గంటల వరకు పూర్తి చేయించాలన్నారు. ఎంపీడీవో వేణుమాధవ్‌, సూపరింటెండెంట్‌ కరుణాకర్‌, ఏపీవో రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ధైర్య సాహసాలకు రివార్డు1
1/2

ధైర్య సాహసాలకు రివార్డు

ధైర్య సాహసాలకు రివార్డు2
2/2

ధైర్య సాహసాలకు రివార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement