మిగిలింది కొద్దిరోజులే.. | - | Sakshi
Sakshi News home page

మిగిలింది కొద్దిరోజులే..

Mar 25 2025 1:52 AM | Updated on Mar 25 2025 1:51 AM

● 31 వరకు సీపీఆర్‌ఎంఎస్‌ గడువు

గోదావరిఖని: వైద్యచికిత్సలపై రిటైర్డ్‌ కార్మికు లు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం క్యాంట్రిబ్యూటరీ పోస్ట్‌ రిటైర్‌మెంట్‌ స్కీం(సీపీఆర్‌ఎస్‌)ను 2018 నుంచి అమలు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రిటైర్డ్‌ కార్మికులు ఇందులో సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 31వ తేదీ వరకు మరోసారి గడువు విధించింది. సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది.

స్కీంలో 35 వేల మంది చేరిక..

పథకం ప్రారంభించిన సుమారు ఏడేళ్లలో దాదా పు 35 వేల మంది రిటైర్డ్‌ కార్మికులు ఇందులో చే రారు. ప్రతీసభ్యుడు రూ.40వేలు చెల్లిస్తే.. యాజమాన్యం మరో రూ.18వేలు కలిపి ఈ పథకం కింద జమచేస్తోంది. దీనిద్వారా రిటైర్డ్‌ కార్మికుడు, అతడి భార్య తమ జీవితకాలంలో గరిష్టంగా రూ.8లక్షల వరకు వైద్య సదుపాయం పొందే వీలుంది. అత్యవసర పరిస్థితుల్లో నగదు చెల్లించి వైద్య చికిత్స పొందినా ఆ తర్వాత బిల్లులు క్లెయి మ్‌ చేసుకునే వీలు కల్పించారు. ప్రాణాంతక, దీర్ఘకాలిక, కాన్సర్‌ లాంటి వ్యాధులకు గరిష్ట పరిమితి ఏమీ లేదు. మలిదశలో సింగరేణి రిటైర్డ్‌ కార్మికులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని యాజమాన్యం చెబుతోంది.

సీపీఆర్‌ఎంఎస్‌ వివరాలు..

పథకంలో చేరిన సభ్యులు 35,000

జమైన సొమ్ము(రూ.కోట్లలో) 400

రిటైర్డ్‌ కార్మికుల వాటా(రూ.కోట్లలో) 250

యాజమాన్యం వాటా(రూ.కోట్లలో) 150

గతేడాది వైద్యం కోసం చెల్లించిన

సొమ్ము(రూ.కోట్లలో) 90

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement