వృద్ధుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి బలవన్మరణం

Nov 14 2023 12:30 AM | Updated on Nov 14 2023 12:30 AM

పోలీసులు పట్టుకున్న లారీ ఇదే..
 - Sakshi

పోలీసులు పట్టుకున్న లారీ ఇదే..

ధర్మపురి: గిరిజన బోదరగూడెంకు చెందిన అద్దరి చిన్నన్న(80) బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు సంతానం కలగకపోవడంతో మరొకరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్నన్న గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్నన్నకు అదే గ్రామానికి చెందిన కొందరితో గొడవలున్నాయి. గొడవల్లో చిన్నన్నకు అవమానం జరగగా.. అది భరించలేక ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

మెట్‌పల్లిరూరల్‌: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు మెట్‌పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆదివారం కోరుట్ల వైపు నుంచి లారీలో తరలిస్తున్న 260 క్వింటాళ్ల బియ్యం మారుతినగర్‌ వద్ద పట్టుబడిందన్నారు. వీటి విలువ సుమారు రూ.5.20 లక్షలుంటుందని అన్నారు. లారీ యజమాని కోరుట్లకు చెందిన అహ్మద్‌గా గుర్తించి అతడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement