ప్రజలకు సురక్షిత నీరు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు సురక్షిత నీరు

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి

విజయనగరం ఫోర్ట్‌: ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలని కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఓ ప్లాంట్‌ లేని పాఠశాలలు, వసతిగృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది సుధీర్ఘ ఎల్‌నినో ప్రభావం వల్ల ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కవిత, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, డీపీఓ మల్లికార్జునరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement