ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతం | - | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతం

Feb 9 2026 7:53 AM | Updated on Feb 9 2026 7:53 AM

ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతం

ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతం

ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతం

విజయనగరం గంటస్తంభం: భారత విద్యార్ధి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్ధు ల కోసం నిర్వహించిన ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతంగా ముగిసింది. తోటపాలెంలో ఉన్న ఎయిమ్‌ స్కూల్‌లో ఈ పరీక్షను ఆదివారం నిర్వహించారు. పరీక్ష పత్రాలను ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఆర్‌.వి.ఆర్‌.కె.చౌదరి, ఎయిమ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బాలాజీ కలిసి ఓపెన్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు 4వేల మందికి పైగా విద్యార్ధులు హాజరయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్ధుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, వారి ప్రతిభను వెలికి తీయడ మే లక్ష్యంగా ఈ ప్రజ్ఞావికాసం పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా భవిష్యత్తులో పాలిటెక్నిక్‌, ఏపీఆర్‌జేసీ వంటి ప్రవేశ పరీక్షలు రాయబోయే విద్యార్ధులకు ఇది ఒక ప్రాక్టీస్‌ పరీక్షగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ స్ధానంలో నిలిచిన విద్యార్థికి రూ.5వేలు, ద్వీతీయ స్థానానికి రూ.3వేలు, తృతీయ స్థానానికి రూ.2వేలు నగదు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement