జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని

Jan 7 2026 7:21 AM | Updated on Jan 7 2026 7:21 AM

జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని

జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని

విజయనగరం అర్బన్‌: న్యూఢిల్లీలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు రాష్ట్రం తరఫున పోటీపడే జట్టులో పట్టణంలోని దాసన్నపేటకు చెందిన ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థిని ఎన్‌.లావణ్య ఎంపికై ంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.రమణమ్మ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 38 కేజీల విభాగంలో లావణ్య బంగారు పతకం సాధించి ఈ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లావణ్యను ప్రధానోపాధ్యాయురాలితో పా టు సీనియర్‌ ఉపాధ్యాయులు ఈ.రామునాయుడు, వ్యాయామ ఉపాధ్యాయురాలు పి.ప్రమీల, బి.ఆషారాణి, సీహెచ్‌వీ రత్నం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement