ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం

Dec 18 2025 7:37 AM | Updated on Dec 18 2025 7:37 AM

ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం

ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం

ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం

రోడ్డు ప్రమాదంలో మరణించిన

కుమారుడి అవయవ దానం

తల్లిదండ్రుల గొప్పతనాన్ని గుర్తించి

సత్కరించిన మానవీయత సంస్థ

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): కన్నకొడుకు మరణించాడని తెలిసినా, ఇక ముందు తమ కుమారుడు తమముందు కనిపించడని తెలిసినా, తమ కొడుకు మరణం మరో పది మందికి జన్మనివ్వాలనే ఆశయంతో దుఃఖంలో కూడా కొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు తమ దాతృత్వం చాటుకున్నారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన టొంపల సుమంత్‌ రాజాంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈనెల 13న విధులు ముగించుకుని రాజాం నుంచి చీపురుపల్లి వైపు ఆటోలో వస్తుండగా ఓ వ్యాన్‌ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్‌ను శ్రీకాకుళం జెమ్స్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్‌డెడ్‌గా వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ మేరకు సుమంత్‌ తల్లిదండ్రులు రమణ, ఆరుద్రలు కొడుకు మరణించిన బాధలో ఉండి కూడా కొడుకు అవయవాలను దానం చేశారు. ఆ తల్లిదండ్రుల దాతృత్వాన్ని గుర్తించిన చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్చంద సంస్థ వ్యవస్ధాపకుడు, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ బీవీ గోవిందరాజులు గ్రామంలోనికి బుధవారం వెళ్లి సుమంత్‌ తల్లిదండ్రులను సత్కరించారు.

12 మందికి పునర్జీవం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కొడుకు అకాల మరణంతో చెప్పలేని దుఖంలో ఉన్నప్పటికీ కొడుకు అవయవాలైన కిడ్నీలు, కాలేయం, హృదయం, నేత్రాలు దానం చేసి మరో 12 మందికి పునర్జీవం కల్పించారని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని జెమ్స్‌ హాస్పిటల్‌లో జరిగిన ఈ అవయవాల దానం గ్రీన్‌ఫీల్డ్‌ ద్వారా పంపించి అవసరమైన వారికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జనరల్‌ సెక్రటరీ రామ్మూర్తినాయుడు, స్థానిక ఎంపీటీసీ టి.సంజీవ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement