సెలవుల్లోనూ పాఠశాలలా?
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వ పాఠశాల లు రెండో శనివారం కూడా తెరుస్తుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరంలో 220 రోజు లు కచ్చితంగా పాఠశాలలు పని చేయాలి. తుఫాన్ల సమయంలో అత్యవసరంగా కొన్ని రోజులు సెలవులు ప్రకటించాల్సి వస్తోంది. ఆ రోజులను పూరించేందుకు రెండో శనివారాల్లోనూ పాఠశాలలు తెరవాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలోనూ కొద్దిరోజులు అదేవిధంగా నడిచాయి. జిల్లాకు సంబంధించి 220 వర్కింగ్ డేస్కు ప్రస్తుతానికి ఇబ్బంది లేనప్పటికీ.. రెండో శనివారం కూడా స్కూళ్లు పని చేస్తున్నాయి. పరీక్షలు దగ్గరకు వస్తున్నందువల్ల పదో తరగతి వరకు మినహాయించినప్పటికీ.. మిగిలిన తరగతులకు సెలవు అమలు చేయాల ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
పాచిపెంట: మండలంలోని కూనం బందవలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు కోట సుహాసిని (4వ తరగతి), మజ్జిదినేష్ (ఒకటో తరగతి) పచ్చకామెర్లతో బాధపడుతూ సాలూరు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ శుక్రవారం కూనంబందవలస గ్రామానికి వెళ్లి పిల్లల కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టు తెలిస్తే వెంటనే పాచిపెంట పీహెచ్సీలో చేర్పించాలని సూచించారు.
నిధుల స్వాహాపై అధికారుల విచారణ
● రూ.43.44లక్షలు స్వాహా అయినట్టు నిర్ధారణ
రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర (సీఎస్పీ) ఆ గ్రామానికి చెందిన 39 సంఘాలకు సంబంధించి రూ.43.44 లక్షల నగదు సొంతానికి వాడుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. సెర్ప్ డీపీఎం ఎ.చిరంజీవి, బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జె.లక్ష్మునాయుడు, సీ్త్రనిధి మేనేజర్ సుధాకర్తో పాటు రేగిడి యూనియన్ బ్యాంకు అధికారులు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. సభ్యుల వద్ద నగదుకు సంబంధించి వివరాలు సేకరించారు. సంఘాల నిధుల స్వాహాకు పాల్పడిన సీఎస్పీ అల్లు శ్రీధర్పై చర్యలకు సిఫార్స్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ సీ్త్ర నిధికి సంబంధించి రూ.2 లక్షలు, పొదుపు, బ్యాంకు లింకేజీలకు సంబంధించి రూ.41లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని చెప్పారు. మహిళా సంఘాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం బాసిన గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ నెల 24న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్లో సంబంధిత అధికారులు, వినియోగదారుల సంఘాల సభ్యులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్ధ సత్వర పరిష్కారం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల, ఇంటర్ స్థాయివారికి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వరుస ముగ్గురు విజేతలకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.
సెలవుల్లోనూ పాఠశాలలా?


