
అతిథులారా.. రారండోయ్!
ఉచిత హామీలు ఇవ్వడం.. అసలు ప్రారంభించని పనులు కూడా అయిపోయినట్టు చెప్పడం, అదే నిజమని జనాన్ని నమ్మించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అప్పట్లో అమరావతిని నిర్మించేశామంటూ గ్రాఫిక్స్ చూపిస్తూ సొంత మీడియాలో ఆర్భాటం చేశారు. ఇప్పుడు అదంతా ఉత్తిదేనని ఒప్పుకుంటూ.. రాజధాని పునఃనిర్మాణమంటూ మళ్లీ హడావిడి మొదలుపెట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి అమరావతికి జనాల తరలింపునకు రూ.కోట్లు ఖర్చుచేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసంక్షేమానికి, అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించేందుకు వెనుకాడే చంద్రబాబు... తన ప్రచార యావకు, సొంత డబ్బా కొట్టుకునేందుకు మాత్రం రూ.కోట్ల ప్రజాధనం ఖర్చుచేయడాన్ని మేధావివర్గం తప్పుబడుతోంది.
అయిపోయిన పెళ్లికి..
విజయనగరం నుంచి వెళ్లిన బస్సులు ఇలా..
విజయనగరం జిల్లాకు సంబంధించి ఎస్.కోట డిపో నుంచి 20, విజయనగరం డిపో నుంచి 30 బస్సులు అమరావతికి వెళ్లాయి. ఇందులో బొబ్బిలి నియోజకవర్గంలో 5, చీపురుపల్లి 5, గజపతినగరం 5, నెల్లిమర్ల 5, రాజాం 5, ఎస్.కోట 5, విజయనగరం నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున బస్సుల ద్వారా జనాలను తరలించారు. ఒక్కో బస్సుకు 40 నుంచి 50 మంది వరకు వెళ్లారు. ఇవి కాక, ప్రైవేట్ సర్వీసుల ద్వారానూ పెద్ద ఎత్తున వెళ్లారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
అయిపోయిన పెళ్లికి కూటమి నాయకత్వం మళ్లీ భజం‘త్రీ’లు వాయిస్తోంది. సంక్షేమ పథ కాలకు తూట్లు పొడిచి... ఆ మొత్తాలను తమ ప్రచారాలకు, ఆర్భాటాలకు ఖర్చు చేస్తోంది. కేవలం గ్రాఫిక్ హంగులతో కూడిన అమరావతి నిర్మాణా లు చేపట్టిన బాబు సర్కారు.. నేడు మరోమారు పునఃప్రారంభ కార్యక్రమాల పేరిట ప్రజాధనం రూ.కోట్లు వెచ్చిస్తోంది. అప్పట్లో ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రాకను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేశారు. వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్తోపాటు పలు శాఖల పరిధిలో మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి వేతనదారులను, దిగువస్థాయి సిబ్బందిని అమరావతి తరలించారు. దీనికోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. తాజాగా మరోమారు ఈ తరహా చర్యలకు తెర తీశారు. అమరావతి రాజధాని పునఃనిర్మాణమంటూ కూటమి ప్రభుత్వం మరోసారి హడావిడి చేస్తుండగా.. అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని కూటమి ఎమ్మెల్యేలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వారేమో అధికారులకు ‘టార్గెట్’లు ఇచ్చారు. ఎక్కువగా మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవా రం జరిగే కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జి ల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలను గుంటూరు జిల్లా అమరావతికి తరలించారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ సర్వీసులను వినియోగించారు.
మన్యం నుంచి బయల్దేరిన బస్సులు..
పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాల నుంచి ఆర్టీసీ సేవల్లో కోత పెట్టి గుంటూరుకు తరలించారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల నుంచి దాదాపు 60 బస్సుల్లో డ్వాక్రా సంఘ సభ్యులు, ఉపాధి వేతనదారులను అమరావతికి తీసుకెళ్లారు. ఈ తంతు నేరుగా జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే సాగడం గమనార్హం. మండలానికి ఒకట్రెండు బస్సులు వెళ్లాయి. ఒక్కో బస్సులో 50 మంది వరకు ఉన్నారు. ప్రధానంగా ఉపాధిహామీ వేతనదారులు, డ్వాక్రా సభ్యులను తరలించేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఈ బాధ్యత ను దిగువస్థాయి సిబ్బందికి అప్పగించారు. వారిపై నాయకులు, శాఖాపరమైన అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చారు. పాలకొండ డిపో నుంచి 14 బస్సు లు గుంటూరుకు కేటాయించగా.. మరో ఐదు సర్వీసులను నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అమరావతికి పంపించారు. గురువారం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ–2, శ్రీకాకుళం–1, కొత్తూరు–5 సర్వీసులు రద్దు చేసి ప్రత్యామ్నాయ సేవలు అందించే ఏర్పాటు చేశారు.
●పార్వతీపురం జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి అయిదు బస్సులు చొప్పున వెళ్లాయి. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో పార్వతీపురం డిపో 14, పాలకొండ 14, సాలూరు 12 బస్సులు చొప్పున వెళ్లాయి. ఇవి కాక.. కొన్ని ప్రాంతాల నుంచి అదనంగా ఉన్న ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ సర్వీసులను కూడా వినియోగించారు. పార్వతీపురం కలెక్టరేట్ నుంచి చుట్టుపక్కల మండలాల ప్రజల కోసం 20 బస్సులు గురువారం బయల్దేరి వెళ్లాయి. 15 మండలాలకూ లక్ష్యాలను నిర్దేశించారు. మండలానికి కనీసం వంద మంది బయల్దేరినట్లు తెలుస్తోంది.
రెగ్యులర్ సర్వీసుల్లో కోత..
పాలకొండ, పార్వతీపురం, విజయనగరం తదితర ప్రాంతాల్లోని రద్దీమార్గాలోని బస్సులను అమరావతికి జనాల తరలింపునకు వినియోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువా రం మధ్యాహ్నం నుంచి ఆయా రూట్లలో వెళ్లేవారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు అమరావతి ప్రయాణమంటేనే విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి మూడు రోజులు కేటాయించాల్సి వస్తుందని.. అన్ని రోజులు కుటుంబాలను, పిల్లలను వదిలి వెళ్లడం కష్టంగా ఉంటుందని పలువురు మహిళలు వాపోయారు. దీనికితోడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బస్సుల్లో అంత దూరం ఎలా వెళ్లగలమంటూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశా రు. వెళ్లకపోతే పనులు కల్పించబోమని హెచ్చరించడంపై పలువురు ఉపాధిహామీ వేతనదారులు నిలదీశారు. అయితే, పై నుంచి వచ్చిన ఆదేశాలంటూ అధికారులు సర్దిచెప్పేప్రయత్నం చేశారు.
అమరావతికి జనాల తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు
అమరావతి పునఃనిర్మాణమంటూ మళ్లీ.. భజం‘త్రీ’లు
మోదీ రాక నేపథ్యంలో భారీ జనసమీకరణ
మండల స్థాయి నుంచి పెద్ద ఎత్తున
అమరావతికి తరలింపు
మహిళా సంఘాలు,
ఉపాధి వేతనదారులే అధికం
హడావిడిలో కూటమి నాయకులు
అధికారులకు బాధ్యతలు.. టార్గెట్లు
రూ.లక్షల ప్రజాధనం వృథా
భోజన ఖర్చుల భారం కార్యదర్శులపైనే..!
అమరావతి పునఃనిర్మాణ సభకు తరలించే జనాల భోజన ఖర్చుల భారం పంచాయతీ కార్యదర్శులపై వేసినట్లు తెలుస్తోంది. ఒక్కో బస్సులో వెళ్లే ప్రజలకు భోజనం, మంచినీటి సౌకర్యాల కోసం సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేయా ల్సి వస్తోంది. బస్సులో ఆహార పొట్లాలు, మంచి నీటి బాటిళ్లను వీరు సమకూర్చినట్లు సమాచారం.

అతిథులారా.. రారండోయ్!

అతిథులారా.. రారండోయ్!