రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

May 31 2025 1:22 AM | Updated on May 31 2025 1:22 AM

రాష్ట

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

పార్వతీపురం టౌన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే అజలంగి జోగారా వు శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనార్టీ యువకులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి మానవహక్కులను ఉల్లంఘించిన వైనాన్ని రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. రాష్ట్రంలో ఉండే బడుగు, బలహీన, దళిత వర్గాలకు పూర్తిగా రక్షణ కరువైందన్నా రు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన చంద్రబాబునాయుడు దళిత సంక్షేమానికి రూ.40వేల కో ట్లు అందజేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దళితులను ఎంత అణిచివేసినా, ఇబ్బంది పెట్టినా, ఎటువంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడినా పోరాటాలు తప్పవని హెచ్చరించా రు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్‌ ఆదేశాల మేరకే దాడులు చేస్తున్నారన్న విషయం తేటతెల్లమయ్యిందన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వానికి దళితులంతా బుద్ధిచెబుతామని హెచ్చరించారు.

88 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌

సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధి లో 88 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. హెచ్‌ఎంలు 5, తెలుగు టీచర్లు 12, హిందీ 14, ఆంగ్లం 12. గణితం 10, పీఎస్‌ 8, బయలాజికల్‌ సైన్సు 9, సోషల్‌ 6, పిజికల్‌ ఎడ్యుకేషన్‌ 5, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 5, పీఈటీ (డబ్ల్యూ) 2 పోస్టులతో పాటు హెచ్‌డబ్ల్యూఓలు నలుగురు, నాల్గో తరగతి సిబ్బందికి కౌన్సెలింగ్‌ చేశారు. కార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూఓ మంగవేణి, ఏఎంఓ కోటిబాబు, హెచ్‌ఎంలు పి.నారాయుడు, సూర్యం, తదితరులు పాల్గొన్నారు.

జీవితంలో యోగా ఒక భాగం కావాలి

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌

గరుగుబిల్లి: ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. యోగాంధ్రలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద శుక్రవారం యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 1500 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వచ్చేనెల 21న నిర్వహించే యోగా డేను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ, సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు, పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీడీఓ ఎన్‌.కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.జగన్‌మోహన్‌రావు, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ రఘుకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులకు సవాల్‌గా

మారిన చోరీ

కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో జరిగిన భారీ చోరీ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎటువంటి జాడ దొరకకపోవడంతో పోలీసులు ముల్లగుల్లాలు పడుతున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వకుల్‌జిందాల్‌ శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా వెళ్లిపోయారు.. ఎంతమేర చోరీకి గురైయింది తదితర అంశాలను బాధితుడు జగదీష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. దొంగతనం జరిగిన పూజాగదిని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు, పలువురు ఎస్‌ఐలతో ఎస్పీ సమావేశమయ్యారు. దర్యాప్తు తీరును తెలుసుకుని పలు సూచనలు చేశారు. దొంగలను తొందరలోనే పట్టుకుంటామని విలేకరులకు వెల్లడించారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు 1
1/1

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement