అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ..నేడు ‘వెన్నుపోటు దినం’
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: ఎన్నికలకు ముందు ప్రకటించిన హమీలు నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 11 నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మంగళవారం పిలుపునిచ్చారు. నిరసన ర్యాలీలు చేపట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా పాలనపై వినతిపత్రాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మర్యాదపూర్వక కలయిక
పార్వతీపురం రూరల్: పార్వతీపురం జిల్లా కేంద్రానికి వచ్చిన గుజరాత్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ను ఆయన స్వగృహంలో విజయనగరం ప్రిన్సిపల్ కోర్టు జిల్లా జడ్జి ఎం.బబిత, కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు అందజేశారు.
సినిమా థియేటర్లలో
ఆకస్మిక తనిఖీలు
చీపురుపల్లి: పట్టణంలోని రాధామాధవ సినీ కాంప్లెక్సు ఆవరణలోని వంశీ, విష్ణు, వైభవ్ సినిమా థియేటర్లను ఆర్డీఓ ఆశియ్య, డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, తహసీల్దార్ రాజారావు తదితరులు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, డ్రింకుల అమ్మకాలు, ధరల పట్టికలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సినీ కాంప్లెక్స్ను తనిఖీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రామ్కుమార్, వీఆర్వో గోవిందరావు, వీఆర్ఏ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్/
గుమ్మలక్ష్మీపురం/పాచిపెంట/పార్వతీపురం రూరల్ :
ఏడాదైంది.. కూటమి నేతల రాక్షస పాలనకు!
ఏడాదైంది.. రాష్ట్రంలో అంబేడ్కర్
రచించిన రాజ్యాంగం స్థానంలో
రెడ్బుక్ అమల్లోకి వచ్చి!
ఏడాదైంది.. ఓటేసిన పాపానికి
వెన్నుపోటు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూసిన ప్రజలకు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలూ బాధితులుగా మారారు. గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లు.. అరచేతిలో వైకుంఠం చూపారు. ఏరు దాటాక హామీలనే తెప్పను తగలబెట్టేశారు. ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చి.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, సాగునీటి జలాలను అందిస్తామని, పరిశ్రమలు తెరిపిస్తామని, రహదారులు నిర్మిస్తామని..
ఇలా ఎన్నో హామీలిచ్చారు. ఇందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.
●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందజేస్తామని నాడు హామీ ఇచ్చా రు. ఏడాది కాలంలో కొత్త పింఛన్ ఏ ఒక్కరికీ ఇవ్వకపోగా.. ఉన్నవి తీసేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 1.46 లక్షల మంది పింఛన్దారులు ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఆ సంఖ్య 1.39 లక్షలకు చేరింది. రూ.4 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటూ నే, అనర్హుల పేరిట లబ్ధిదారుల ఏరివేత సాగుతోంది. 50 ఏళ్లకే పింఛన్ అన్న హామీ కూడా నెరవేర్చలేకపోయారు. గతంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్ అందిస్తే.. ఇప్పుడు వీధి చివరన రచ్చబండకో, ఏగుడి వద్దకో పిలిపించుకుని అందజేస్తున్నారు.
●రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.13,500 కంటే అధికమన్నారు. ఏడాది కాలంలో పెట్టుబడి సాయం కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే రెండు దఫాలు సాయం విడుదల చేసింది. చంద్రబాబు మాటలు నమ్మి ఓటేసిన సుమారు 1.45 లక్షల మంది రైతులు దగా పడ్డారు.
●గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిశ్చింతగా అమ్మ ఒడి పథకాన్ని ఏటా రూ.15 వేల చొప్పున పిల్లలను బడికి పంపే తల్లులు పొందేవారు. తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. ఏడాది కాలంలో ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేశారు.
●ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.18 వేలు ఇస్తామని చెప్పి దగా చేశారు. తాము ఎక్కాల్సిన ఉచిత బస్సు ఎప్పుడొస్తుందా? అని జిల్లాలోని లక్షలాది మంది మహిళలు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు.
●ఇంటికో ఉద్యోగమన్నారు. లేదంటే చదువుకున్న వారందరికీ నిరుద్యోగ భృతి కింద ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఎలానూ ఇవ్వలేకపోయారు.. పోనీ భృతి అయినా అందుతుందని జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఏడాదిగా ఒక్కొక్కరికీ రూ.36 వేలు చొప్పున కూటమి ప్రభుత్వం బాకీ పడింది.
●కక్షపూరితంగా సస్పెండ్ చేశారు..
పాచిపెంట మండలం కేసలి పంచాయతీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా 19 ఏళ్లుగా పని చేస్తున్నాను. నా భార్య వైఎస్సార్సీపీ సర్పంచ్ కావడంతో నాపై కక్ష గట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు నుంచి తొలగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒకరకంగా నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
– సత్తారపు రాము, పాచిపెంట మండలం
●తల్లికి వందనం ఎప్పుడిస్తారో...
గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా పిల్లల చదువులు సక్రమంగా సాగేవి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరిట ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఏడాది కాలంగా రూపాయి కూడా రాలేదు. ముగ్గురు పిల్లలు చదువుకయ్యే ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నాం. తల్లికి వందనం పథకం వస్తుందని ఆశగా చూస్తున్నాం.
– ఎప్పరిక మిస్సమ్మ, విద్యార్థుల తల్లి,
మూలజమ్ము, గుమ్మలక్ష్మీపురం మండలం
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పిట్ట గౌరునాయుడు. కొమరాడ మండలం కోటిపాం గ్రామం. తనకు ఏ ఆధారమూ లేదని.. గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారని.. తనకు పింఛన్ ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నాడు. గత సోమవారం పీజీఆర్ఎస్కు వచ్చి అధికారులకు అర్జీ అందించాడు.
అడ్డొస్తే.. బుల్డోజర్లే!
తమ అడ్డదారికి ఎదురొచ్చిన వారిని భయపెట్టి, బెదిరించి.. దారిలోకి తెచ్చుకోవడమే ఏడాది పాలనలో కూటమి నాయకులు పనిగా పెట్టుకున్నారు.
●పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన చుక్క శ్రీదేవి అనే మహిళకు సంబంధించిన నిమ్మగడ్డి, ఇతర తోటలను, పరికరాలను ధ్వంసం చేశారు. ఆమె లేని సమయంలో నివాస గృహాన్ని సైతం బుల్డోజర్తో నేలమట్టం చేశారు.
●ఓ ఇంటిలో అద్దెకు అడుగుపెట్టి, ఆనక యజమానికి భయపెట్టి, తక్కువ ధరకే ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంతం చేసుకున్నారు.
●పార్వతీపురం మండలంలోని బంటువానివలసలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రజాసంఘాల నాయకుని స్థలాన్ని ధ్వంసం చేశారు.
●జిల్లా కేంద్రంలో ఓ పాత్రికేయుని ఇంటిని కక్షసాధింపుగా జేసీబీతో కూల్చివేశారు. వార్తలు రాసే పాత్రికేయులపై బెదిరింపు ధోరణి కింద పోలీసులతో అక్రమ కేసులు బనాయించారు.
●చెప్పిన మాట వినలేదని ఓ మహిళా తహసీల్దారుకు అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి మరీ అసభ్యకరంగా దూషించారు.
సెటిల్మెంట్లు, విధ్వంసాలు, బెదిరింపులు, కమీషన్లగానే ఏడాది పాలన జిల్లాలో సాగింది.
●పాలకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగింది. సాక్షాత్తు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వినిపించాయి. కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లోనూ తమ్ముళ్లకు ఇసుక వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
●మద్యం దుకాణాల నుంచి 10 శాతం, గోశాలలకు రూ.10 వేలు చొప్పున కమీషన్ రేటు కట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
●ఉపాధి హామీ వేతనదారుల వద్ద వారానికి రూ. 100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం అటు అధికారులతోపాటు.. ఇటు ప్రజాప్రతినిధులకూ వెళ్తున్నట్లు వినిపిస్తోంది.
●డీలర్ పోస్టుల నుంచి అంగన్వాడీల వరకు.. ఇతర శాఖల్లోనూ తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టుల విషయంలోనూ కూటమి నేతలు తలదూర్చారు. పోస్టును బట్టి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు భోగట్టా. పోస్టుల పంపకం విషయంలో తేడా రావడంతో ఇటీవల ఓ శాఖలోని పోస్టులను డబ్బులు తీసుకుని మరీ.. భర్తీ చేయకుండా విడిచిపెట్టడం గమనార్హం.
●అభివృద్ధి పనుల టెండర్ల విషయంలోనూ కమీషన్లకు కక్కుర్తి పడి, తమ అనుచరులకే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు. ఇటీవల కురుపాం నియోజకవర్గంలోని ఓ రహదారి నాణ్యత డొల్లతో వేసిన 20 రోజులకే పైకి తేలిపోయింది. పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే చెప్పిన అనుచరునికి కాక మరో వ్యక్తికి ఓ కాంట్రాక్టు రావడంతో పనులు అప్పగించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇటీవల ఓ వ్యక్తి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు.
●సర్పంచ్ల తీర్మానాలు లేకుండానే గ్రామాల్లో కూటమి నేతలు ఇష్టానుసారం పనులు చేయించుకుంటున్నారు. దీంతో జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో పలువురు సర్పంచ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యూస్రీల్
ఏడాదిగా విధ్వంస పాలన రెడ్బుక్ అమలుకే సరి... పథకాలకు చోటేదీ? కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై వైఎస్సార్సీపీ మరో పోరు నేడు జిల్లావ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’
అంగట్లో పోస్టులు.. ప్రతి పనికీ కమీషన్లు
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025