
తాలాడలో ఏనుగుల విధ్వంసం
భామిని: భామిని మండలం తాలాడలో ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. ఆరుగాలం శ్రమించి సాగుచేసి చేతికొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతు కుటుంబం గగ్గోలు పెడుతోంది. రైతు ఆర్. కాంతారావు మొక్కజొన్న పొత్తులను నూర్పిడిచేసి 55 బస్తాల గింజలను కళ్లాంలో నిల్వచేశాడు. వాటిలో 27 బస్తాల గింజలను ఏనుగుల గుంపు శుక్రవారం నాశనం చేశాయి. చెల్లాచెదురుగా విసిరేయడంతో రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. సర్పంచ్ వై.ప్రభావతి, వైఎస్సార్సీపీ నాయకుడు ఎరుకుమజ్జి పాపినాయుడు కళ్లాంకు చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగులు నష్టపరిచిన పంటను పరిశీలించి ఆదుకోవాలని కోరారు. ఐలమ్మ తోటలో నాలుగు ఏనుగులు తిష్టవేయడంతో భయాందోళన చెందుతున్నారు.
27 బస్తాల మొక్కజొన్న గింజలు ధ్వంసం
గగ్గోలు పెడుతున్న రైతు కుటుంబం