
మంచం పట్టిన మన్యం
సీతంపేట:
నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటే వ్యాధులు ముసురుకుంటున్నాయి. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి పెరిగింది. కొన్ని గ్రామాల్లో వందలాది మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటా జ్వరపీడితులు కనిపిస్తున్నారు.
భయపెడుతున్న మలేరియా..
జిల్లాలో మలేరియా ప్రభావితమైనవిగా 245 గ్రామాలను వైద్యాధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా మలేరియా నివారణ చర్యలను వైద్యశాఖ చేపడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,12,059 మంది నుంచి రక్త పూతలు సేకరించి పరీక్షించగా 977 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే వారి సంఖ్యను కలిపితే దీనికి రెండింతలు
ఏజెన్సీలో జ్వరాల విజృంభణ
జిల్లాలో 977 మలేరియా పాజిటివ్ కేసులు
245 హైరిస్క్ గ్రామాలను గుర్తించిన
అధికారులు
ఆరంభమైన ఎపిడమిక్ సీజన్
అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే
ఉంటుందని అంచనా. గతేడాది 1,07,984 మందికి రక్తపూత పరీక్షలు నిర్వహించగా 213 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
అప్రమత్తంగా ఉన్నాం
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. హైరిస్క్ గ్రామాల్లో మాస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మిగిలిన గ్రామాల్లో ఎక్కడైనా జ్వరాలు వంటివి ఉంటే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. దోమల నివారణ మందు వంటివి స్ప్రే చేయిస్తున్నాం. ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
– కె.విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్వో, సీతంపేట

మంచం పట్టిన మన్యం

మంచం పట్టిన మన్యం