
అంతా ఎదురుచూపులు
–10లో
ఆ రెండింటి కోసమే..
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శనివారం చిన్నారులు చేసిన సంప్రదాయబద్ధ నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆటల్లేవు..ఆహ్లాదం లేదు..!
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీస్కూల్ చిన్నారుల భవితను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025
పార్వతీపురం టౌన్:
కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా.. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఇంకోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామంటూ ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు పథకాల సొమ్మును ఎప్పుడొచ్చి పడతాయా.. అని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. జూన్ వచ్చిందంటే చాలు తల్లుల దగ్గర నుంచి రైతుల వరకు అందరిదీ ఒకటే టెన్షన్. ఒక వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైతే.. మరోవైపు రైతులకు వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. ఈ క్రమంలో అన్ని కుటుంబాల్లో ఆర్థిక అవసరం ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పథకాలు వర్తించే లబ్ధిదారులంతా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతుభరోసా పథకాల ద్వారా అందించిన సొమ్ము తమ ఖాతాలో జమ చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు రైతుకు అందించేలా హామీ ఇచ్చింది. కానీ అధికారం చేపట్టి ఏడాదైనా నేటి వరకు వాటి జాడ లేకుండా పోయింది.
న్యూస్రీల్
గతంలో క్రమం తప్పకుండా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మఒడి, రైతు భరోసా పథకాలు అందజేసేవారు. తల్లులకు, అన్నదాతలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా విద్యాసంవత్సరం, ఖరీఫ్ సీజన్కు సకాలంలో నిధులు జమ చేసేవారు. అమ్మఒడి పథకం ద్వారా నాలుగు విడతల్లో 83,821 మంది తల్లుల ఖాతాల్లో రూ.497.28 కోట్లు, రైతు భరోసా కింద 1,42,930 మంది అన్నదాతల ఖాతాల్లో నాలుగేళ్లకు కలిపి రూ.878.07 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు.
అన్నదాత సుఖీభవ జాడ లేదు..
పాఠశాలలు తెరవక ముందే తల్లికి వందనం కావాలంటున్న తల్లులు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పని పథకాల లబ్ధి
జిల్లాలో అమ్మ ఒడి లబ్ధిదారులు 83,821 మంది
రైతు భరోసా లబ్ధిదారులు 1,42,930 మంది
అన్నదాతకు అన్యాయం
రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అన్నారు. ఆచరణలో అమలు కావడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు గతంలో రైతుభరోసా పథకం ధ్వారా క్రమం తప్పకుండా నిధులు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు ఒక్కటీ అందించడం లేదు.
– వంగపండు శంకరరావు, రైతు,
పార్వతీపురం
ఎంత మంది ఉంటే.. అందరికీ అన్నారు...
తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. గతంలో క్రమం తప్పకుండా నిధులు జమ చేసేవారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ప్రభుత్వం ఈ పథకంపై గాలి మాటలు చెబుతోంది. తక్షణమే ప్రకటన విడుదల చేయాలి.
– ఎస్.ప్రసన్న,
విద్యార్థి తల్లి, పార్వతీపురం
గతంలో క్రమం తప్పలేదు..
అమ్మ ఒడి పథకం ద్వారా గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా నిధులు జమ చేసేవారు. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందు ఈ నిధులు జమ చేసేవారు. పిల్లల ఫీజులకు, ఇతర అవసరాలకు ఈ మొత్తం ఉపయోగపడేది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చింది. సంవత్సరం గడుస్తున్నా జమ చేయ లేదు.
– వి.జయలక్ష్మి, తల్లి, వైకేఎం కాలనీ,
పార్వతీపురం
తల్లుల్లో టెన్షన్..
అప్పుడు అమ్మఒడి.. ఇప్పుడు తల్లికి వందనం. పథకాలు పేరు మారినా వీటి కింద లబ్ధిదారులకు అందబోతున్న సొమ్ము ఒక్కటే.. గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఏడాదికి రూ.13,500 వేలు తల్లుల ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేసేవారు. కానీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఇంట్లో చదువుకునే పిల్లలందరికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా హామీ అమలు చేయకపోవడంతో తల్లులలో ఆందోళన నెలకొంది. ఈ నెల 12న పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం అయ్యే తేదీ దగ్గర పడింది. ఆ లోపే తల్లికి వందనం కింద సొమ్ములను జమ చేస్తారా.. లేదా.. అన్నది అందరిని పట్టి పీడిస్తున్న ప్రశ్న. ఇప్పుడు గతం కంటే విద్యార్థుల సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. ఒకటికి రెండుసార్లు దరఖాస్తులను వడపోస్తున్నారు. ఆ రెండింటి సొమ్ములు ఎప్పుడు ఖాతాలో వేస్తారంటూ ప్రజల్లో ఆందోళ నెలకొంది.

అంతా ఎదురుచూపులు

అంతా ఎదురుచూపులు