
పిల్లలకు సున్నం రాసి!
● ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ● నాడు వైఎస్సార్సీపీ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ● నేడు తిరోగమన దిశలో సర్కారు బడులు ● మధ్యలోనే నిలిచిన ‘నాడు–నేడు’ నిర్మాణాలు ● వందనం పేరుతో తల్లికి ఎగ‘నామం’
నాడు : నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను గత ప్రభుత్వం మార్చింది. తొలిదశలో 486 పాఠశాలల్లో రూ.130.14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రెండో విడతలో రూ.144.51 కోట్లతో 535 పాఠశాలల్లో ఆధునికీకరణ పనులు జరిపారు. గోడలపై బొమ్మలు, రంగరంగుల బల్లలు, కుర్చీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, కిచెన్ షెడ్డు, గ్రీన్చాక్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్ వంటివాటితో పాఠశాలలు కళకళలాడేవి. పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం జిల్లాలో ఒక్క ఏడాదిలోనే రూ.35 23 కోట్ల వరకూ వెచ్చించారు.
నేడు : ప్రభుత్వం మారడంతోనే ఏడాదిలోనే బడి గతి మారిపోయింది. నాడు–నేడు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అదనపు తరగతి గదుల భవనాలను అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో స్థానికులు వాటిని పశువులు కట్టేందుకు వినియోగిస్తున్నారు.
పిల్లర్ల దశలో నిలిచిపోయిన మునక్కాయవలస ప్రాథమిక పాఠశాల నిర్మాణం
చిత్రంలో పునాదుల దశలో నిలిచిపోయినది పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని మునక్కాయవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు రెండో విడతలో విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాల భవనాన్ని మంజూరు చేసింది. పునాదుల వరకు నిర్మించింది. ఈ దశలో ప్రభుత్వం మారడంతో ఏడాదిగా కనీసం ఒక్క ఇటుక నిర్మాణం కూడా చేపట్టలేదు. గెంజిగెడ్డు, చినగెంజిగెడ్డ, చింతలవలస, కొయ్యిమెట్టవలస తదితర గ్రామాలకు చెందిన 40 మంది చిన్నారులు అక్కడ నిర్మించిన చిన్న రేకుల షెడ్డులోనే విద్యను అభ్యసిస్తున్నారు. పార్వతీపురం మండలంలోని లక్ష్మీనారాయణపురం ప్రాథమిక పాఠ శా ల, ఎమ్మార్నగ రం జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలల పను లు సైతం అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.
– పార్వతీపురం
రూరల్
సాక్షి, పార్వతీపురం మన్యం:
ప్రతి ఇంటా విద్యాదీపాలు వెలిగిస్తే.. ఆ కుటుంబాలకు సదరు విద్యార్థులే వెలుగు చూపు తారని గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మ క మార్పులను తీసుకొచ్చారు. నాడు–నేడుతో ప్ర భుత్వ పాఠశాలలను సరికొత్తగా తీర్చిదిద్దారు. రంగురంగుల బల్లలు.. కుర్చీలు, ఏకరూపు దుస్తులు, బూట్లు, బ్యాగులు, డిక్షనరీలు.. బైలింగ్విన్ పుస్తకా లు, ట్యాబ్లు, డిజిటల్ ప్యానల్స్.. ఇలా విద్యార్థికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు శుద్ధజలం, రాగిజావ, చిక్కీలు, గుడ్లు వంటివి సమకూర్చారు. ఫలితంగానే పరీక్షల ఫలితాల్లోనూ మన్యం జిల్లా విద్యార్థులు అగ్రస్థానం దక్కించుకున్నారు. నాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ పూర్వ వైభవం దిశగా సాగిన ప్రభుత్వ బడి.. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో సదుపాయాల కల్పనలో చతికిలబడింది.
●నాడు చక్కగా ‘కానుక’
నాడు : ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలకు జగనన్న విద్యాకానుక కిట్లను ఏటా అప్పటి ప్రభుత్వం అందించేది. పాఠశాలలు తెరిచే రోజునే వీటిని సరఫరా చేసేది. ఇందులో మూడు జతల యూనిఫారాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ వంటివి ఉండేవి. జిల్లాలో ఏటా సుమారు 96 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేది. ఇందుకోసం ఏటా రూ.18 కోట్లకుపైగా అప్పటి ప్రభుత్వం వెచ్చించింది.
నేడు : గత విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా స్టూడెంట్ కిట్ల ను అందించలేకపోయింది. జిల్లాలోని 1,584 పాఠ శాలల్లో 90 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతుండగా.. కొన్ని రోజులు తరగతులు అయిపోయిన తర్వాత తీరిగ్గా సరఫరా చేసింది. అవి కూడా అరకొరగానే.
నాడు మిలమిల..

పిల్లలకు సున్నం రాసి!

పిల్లలకు సున్నం రాసి!

పిల్లలకు సున్నం రాసి!